ప్రస్థుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్స్ హవా నడుస్తున్న నేపద్యంలో చాలామంది నిర్మాతలు ఇద్దరి హీరోలను కలిపి ఒక మంచి సినిమా తీయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మంచి సినిమాల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఇద్దరి హీరోలకు సరిపడే ఒక మంచి కథను వ్రాసుకున్నట్లు సమాచారం. 

ఈకథకు సంబంధించి నిర్మాతగా వ్యవహరించడానికి దిల్ రాజ్ ముందుకు వచ్చినా ఆకథకు నప్పే ఇద్దరి హీరోల అన్వేషణ ఇంద్రగంటి మోహన్ కృష్ణ దిల్ రాజ్ లకు సమస్యగా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ ఫీల్ గుడ్ స్టోరీలో హీరోగా నటించడానికి నానీ ఒకే అన్న తరువాత దర్శకుడు ఇంద్రగంటి దుల్కర్ సల్మాన్ ను ఈవిషయం పై కాంటాక్ట్ చేసినట్లు టాక్. 

వాస్తవానికి ఈకథ దుల్కర్ కు బాగా నచ్చినా ఈమూవీకి ఓకె చెప్పలేని స్థితిలో దుల్కర్ ఉన్నట్లు సమాచారం. దీనికి కారణం శంకర్ కలహాసన్ తో తీయబోతున్న ‘బారతీయుడు 2’ మూవీలో దుల్కర్ చేత ఒక కీలక పాత్ర చేయిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈవార్తలు దుల్కర్ వరకు వెళ్ళడంతో నాని ఇంద్రగంటి చేసే మూవీ ప్రాజెక్ట్ కు డేట్స్ ఇచ్చి ఇరుక్కునే కన్నా శంకర్ సినిమాలో ఛాన్స్ కోసం వెయిట్ చేయడం మంచిది అన్న ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనితో ఇంద్రగంటి మోహన్ కృష్ణకు కనిపించని శత్రువుగా దర్శకుడు శంకర్ మారాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి. ప్రస్తుతం దుల్కర్ ఏవిషయం తేల్చకపోవడంతో ఈమూవీ ప్రాజెక్ట్ కోసం ఇంద్రగంటి తన కథను పుచ్చుకుని చాలామంది హీరోల చుట్టూ తిరిగుతున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: