ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబాని కూతురు ఇషా అంబానీ ప్రముఖ రియల్ ఎస్టేట్ టైకూన్ ఆనంద్ పిరమాళ్ ప్రీవెడ్డింగ్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. బాలీవుడ్ సెలెబ్రెటీల నుండి రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు ఎందరో పాల్గొన్న ఈ వేడుకలలో మన దక్షిణాది సినిమా రంగం నుండి ప్రభాస్ ఒక్కడుకు మాత్రమే ఆహ్వానం అందడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.  

ఈకార్యక్రమానికి హాజరు అయ్యే సినీ రాజకీయ క్రీడా పారిశ్రామిక వేత్తలతో అతిపెద్ద జాబితాను రూపొందించిన అంబానీలు అందులో ప్రభాస్ పేరును చేర్చడం ఇప్పుడు ప్రధాన చర్చలకు కేంద్రంగా మారింది. ఒక్క ‘బాహుబలి’ మూవీ ప్రాజెక్ట్ తో ప్రభాస్ కు ఉత్తరాదిన ఏరీతిలో క్రేజ్ ఏర్పడిందో ఈ సంఘటన రుజువు చేస్తోంది అన్న కామెంట్స్ వస్తున్నాయి.

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్ రెడ్ చిల్లీస్ అధినేత కింగ్ ఖాన్ షారూక్ కి ఎంత గౌరవం దక్కిందో ఈ ఫంక్షన్ లో డార్లింగ్ ప్రభాస్ కు కూడ అంతే స్థాయిలో గౌరవం దక్కడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇంతటి ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ప్రభాస్ చాల సింపుల్ గా ఎటువంటి ఆర్భాటం లేకుండా వెళ్ళడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.

సామాన్యంగా పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్ కు చాల దూరంగా ఉండే ప్రభాస్ తన పద్ధతి మార్చుకుని ఈ ఫంక్షన్ కు రావడమే కాకుండా ఈ ఫంక్షన్ కు వచ్చిన చాలామంది ప్రముఖులను పలకరిస్తూ కనిపించడం మరింత ఆశ్చర్య కరంగా మారింది. బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ ప్రభాస్ ను ఆకార్యక్రమానికి వచ్చిన అతిధులు అందరికీ పరిచయం చేస్తుంటే ప్రభాస్ తన బిడియం వీడి అందరితోను కలిసిపోయాడు. సినిమాలు చాల తక్కువగా చూసే ముఖేష్ అంబానీ ‘బాహుబలి’ మూవీ తరువాత ప్రభాస్ అభిమానిగా మారిపోయిన నేపధ్యంలో ప్రభాస్ కు అంబానీల పెళ్లి వేడుకలలో ఇలాంటి గౌరవం దక్కింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: