ఈనెల 21న క్రిస్మస్ ను టార్గెట్ చేయబోతూ ఇద్దరు యంగ్ హీరోల మధ్య మూవీ వార్ జరగబోతోంది. శర్వానంద్ ‘పడిపడి లేచె మనసు’ వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ మూవీల మధ్య జరగబోతున్న వార్ లో ఎవరు విజేతగా నిలుస్తారు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ రెండు సినిమాలకు మంచి అంచనాలు ఉండటంతో పాటు ఈమూవీలకు దర్శకత్వం వహించిన హను రాఘవపూడి సంకల్ప రెడ్డి లకు మంచి పేరు ఉండటంతో ఈరెండు సినిమాలకు మంచి బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం శర్వానంద్ కొంత వరకు పరాజయాలలో పయనిస్తున్న నేపధ్యంలో అతడి లేటెస్ట్ మూవీ ‘పడిపడి లేచే మనసు’ పై చాల ఆసలు పెట్టుకున్నాడు. సాయి పల్లవి గోల్డెన్ లెగ్ సెంటిమెంట్ తో పాటు హను రాఘవపూడి ప్రతిభ పై శర్వానంద్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించి హడావిడి చేస్తున్న ఒక గాసిప్ ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ కథ పాత సినిమాల కథను పోలి ఉంటుందని ముఖ్యంగా హీరో తాను ప్రేమించిన అమ్మాయిని తన మతిమరుపు వల్ల మరిచిపోయే పాయింట్ చుట్టూ అల్లిన కథ ఇది అనీ ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఈమధ్యనే విడుదలై ఘోరంగా ఫ్లాప్ అయిన సాయి ధరమ్ తేజ్ ‘తేజ్ ఐ లవ్ యు’ మూవీ కథను పోలి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. 

దీనితో ఒక ఫ్లాప్ సినిమా కథను అనుసరించడమే కాకుండా ఇప్పటికే ఇలాంటి కథతో అనేక సినిమాలు వచ్చిన స్టోరీ లైన్ ను శర్వానంద్ ఎందుకు ఎంచుకున్నాడు అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. దీనితో శర్వానంద్ వరుణ్ తేజ్ ల మధ్య జరగబోతున్న క్రిస్మస్ వార్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది..



మరింత సమాచారం తెలుసుకోండి: