తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో కూకట్ పల్లి నియోజక వర్గం నుండి జూనియర్ ఎన్టీఆర్ సోదరి నందమూరి సుహాసిని ఘోర పరాజయం చెందడం నందమూరి అభిమానులకు బాధ కలిగించినా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తారక్ తెలివిగా పరాభవం నుండి తప్పించుకున్నాడు అంటూ ఆనంద పడుతున్నట్లు టాక్.
జూనియర్ అభిమానుల అభిప్రాయం ప్రకారం తారక్ ఓపెన్ గా సపోర్ట్ ఇచ్చి తన సోదరి సుహాసిని కోసం ప్రచారం చేసినా ఇలాంటి ఫలితమే వస్తుందని అందువల్ల జూనియర్ తెలివిగా తన పరువు కాపాడుకున్నాడు అనీ అభిమానులు ఆనంద పడుతున్నారు.

దీనికితోడు వరస విజయాల మధ్య దూసుకుపోతున్న జూనియర్ ప్రస్తుతం రాజకీయాల కంటే తన కెరియర్ గురించి చూసుకోవడం చాలా మంచిదని జూనియర్ అభిమానుల అభిప్రాయం. అయితే సుహాసిని ఓటమితో నందమూరి హరికృష్ణ ఫ్యామిలీ రాజకీయాలకు సంబంధించిన ఆకాంక్షలు పూర్తిగా సమాధి అయినట్లే అనీ భవిష్యత్ లో జూనియర్ రాజకీయాల వైపు రావడానికి కూడ భయపడేలా సుహాసిని ఘోర పరాజయం మారింది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగువారు ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీని బాగా అభిమానించే సెటిలర్స్ ఎక్కువగా ఉన్న కుకట్ పల్లి లాంటి కీలక ప్రాంతంలో కూడ నందమూరి కుటుంబం పేరు చెపితే పెద్దగా ఓట్లు పడలేదు అంటే తమ నందమూరి కుటుంబానికి బలం లేదు అని ఓపెన్ గా తెలిసే విషయంగా సుహాసిని ఓటమి సంఘటన మారింది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థుతులలో తిరిగి బాలయ్య జూనియర్ ల మధ్య గ్యాప్ మళ్ళీ బయటపడే ఆస్కారం ఉంది అంటూ మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. 

ఈ పరిస్థుతులు ఇలా ఉంటే త్వరలో తిరుపతిలో జరగబోయే ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఫంక్షన్ కు జూనియర్ ను పిలుస్తారా పిలిచినా అతడు వస్తాడా అన్న విషయాల పై జూనియర్ బాలయ్యల బంధం మరొకసారి బయటపడబోతోంది అంటూ మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. సుహాసిని పరాజయంతో భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ జిల్లాలలో జూనియర్ స్వయంగా జనం మధ్య తిరిగినా ఎన్నికలకు సంబంధించి జనం వస్తారు కానీ ఓట్లు రావు అన్న విషయం మరొకసారి జూనియర్ కు సుహాసిని పరాజయం గుర్తుకు చేస్తుంది అని అంటూ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: