ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు జూనియర్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ    తాను చెప్పడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ ను అప్పట్లో ఎన్టీఆర్ తమ ఇంటికి పిలిపించారని ఎంతైనా మన మనవడే కదా అంటూ తాను స్వయంగా ఎన్టీఆర్ ను ఒప్పించి జూనియర్ ను పిలిపించడమే కాకుండా అతడిని నందమూరి కుటుంబంలో భాగం చేసిన వ్యక్తిని తాను మాత్రమే అంటూ అప్పటి విషయాలను లక్ష్మీ పార్వతి గుర్తుకు చేసుకుంది. 
Jr NTR
అంతేకాదు అప్పట్లో జూనియర్ మొదటిసారి తమ ఇంటికి వచ్చిన సమయంలో తమ మధ్యలో నిల్చుని జూనియర్ ఎన్టీఆర్ ఫొటో తీయించుకున్న విషయాన్ని వివరిస్తూ ఆతరువాత ఎన్టీఆర్ మరణించాక ఆ ఫొటోల్లోంచి తనను తీసేసి తాతతో ఉన్న ఫొటోను మాత్రమే జూనియర్ పెట్టుకున్నాడని లక్ష్మి పార్వతి చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆ రోజుల్లో తాను ఎన్టీఆర్ కు చాలా సాయం చేశాను అంటూ త్యాగరాజ గాన సభల్లో తాను జూనియర్ చేత మొట్టమొదటి డాన్స్ అరంగేట్రం చేయించిన విషయాలను కూడ ఆమె గుర్తుకు చేసుకున్నారు. 
Jr NTR
ఇదే సందర్భంలో అప్పటి విషయాలను గురించి మరింత వివరంగా మాట్లాడుతూ ఎవరైనా వైభవంగా ఉన్న సమయంలోనే అందరు దగ్గరగా ఉంటారనీ ఎప్పుడైతే ఆ వైభవంను కోల్పోతారో అంతా దూరం అవుతారు అంటూ వేదాంత ధోరణి ప్రదర్శించింది లక్ష్మీ పార్వతి. అయితే తాను జూనియర్ ఎన్టీఆర్ పై అంత ప్రేమ కనపరచినా ఆ తరువాత జరిగిన పరిణామాలలో తారక్ కూడా నందమూరి కుటుంబానికి చెందినవాడే కాబట్టి అతడు కూడ తనను పూర్తిగా దూరం పెట్టాడు అంటూ గగ్గోలు పెడుతోంది.
Jr NTR new look in Trivikram film NTR 28
ఇదే ఇంటర్వ్యూలో మరొక ట్విస్ట్ ఇస్తూ ఎన్టీఆర్ బయోపిక్ లో తన పాత్రను చూపించే సాహసం బాలకృష్ణ చేయలేడు అంటూ కామెంట్ చేయడమే కాకుండా తన పాత్రను ఎన్టీఆర్ బయోపిక్ లో చూపెడితే అనేక వాస్తవాలు చూపించవలసి వస్తుంది అంటూ బాలయ్య పై సెటైర్లు వేస్తోంది లక్ష్మీ పార్వతి. అంతేకాదు తన జీవితం పై వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ పై మాట్లాడుతూ వర్మ ఈమూవీ విషయంలో ఎన్ని మార్పులు చేర్పులు చేసినా చివరకు సెన్సార్ బోర్డ్ వద్ద తన సంతకం లేకుండా ఆమూవీ బయటకు రాలేదు అని అంటూ వర్మకు పరోక్షంగా సంకేతాలు ఇస్తోంది ఈ నందమూరి తారకరామారావు సతీమణి..  


మరింత సమాచారం తెలుసుకోండి: