గత కొన్ని రోజులుగా ప్రభాస్ హైదరాబాద్ రాయదుర్గం సమీపంలో కొనుక్కున్న గెస్ట్ హౌస్ వివాదం పై తెలుగు మీదియాలోనే కాకుండా బాలీవుడ్ మీడియాలో కూడ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ప్రభాస్ గెస్ట్ హౌస్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విషయంలో ఈరో జు హైకోర్ట్ ప్రభాస్ కు తాత్కాలిక ఊరటను ఇస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. 
కౌంటర్ దాఖలు చేయాలి
ఈ విషయానికి సంబంధించి ప్రభాస్ తరపున వాధించిన న్యాయవాది ప్రభాస్ కు ఈవిషయానికి సంబంధించి ఎటువంటి నోటీసులు ప్రభుత్వం ఇవ్వలేదని కేవలం ఈ వ్యవహారం అంతా ఒక తప్పుడు సమాచారం కేసుగా వాధించినట్లు తెలుస్తోంది. దీనితో ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించమని జడ్జి ఆదేసించినట్లు సమాచారం. 
 క్రేజీ చిత్రాలతో
తాత్కాలికంగా ఈ కేసు వ్యవహారంలో ప్రభాస్ కు ఊరట లభించినా తెలంగాణ ప్రభుత్వం ప్రభాస్ గెస్ట్ హౌస్ విషయంలో కోర్ట్ లో దాఖలు చేయబోయే కౌంటర్ ను బట్టి ఈ కేసు విషయం ఆధారపడి ఉంటుందనీ న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే ప్రభాస్ చుట్టూ ఈ ఈ భూమి తగాదాలు చుట్టుకోవడంతో ప్రస్తుతం ఈవార్తలు ఇన్ ఇండస్ట్రీకి కూడ హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

ఎలాంటి నోటీసులు లేకుండా

ప్రభాస్ ను చుట్టుముట్టిన ఈవివాదాల నుండి అతడు తొందరగా బయట పడి తిరిగి ప్రస్తుతం అతడు నటిస్తున్న ‘సాహో’ ఇతర సినిమాల విషయం పై దృష్టి పెట్టాలని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: