క్రేజి హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పై చేసిన కామెంట్స్ పెను వివాదాన్ని సృట్టిస్తున్నాయి. గతవారం విడుదలైన జీరో మూవీని చూసిన పాయల్ రాజ్ పుత్ తన అభిప్రయాన్ని తెలియజేస్తూ ఒక ఫన్నీ వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియోలో పాయల్ చేసిన వ్యాఖ్యలు షారుఖ్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగించాయి. ‘జీరో’ మూవీలో షారుఖ్ సగం కనబడడం లేదు అంటూ కామెంట్ చేసింది ఈ క్రేజి బ్యూటీ.
ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ కావడంతో షారుఖ్ అభిమానులు పాయల్ పై రెచ్చిపోతున్నారు. అంతేకాదు నటించిన ఒక్క సినిమాకే ఇంత అహం కారం వచ్చిందా అంటూ సెటైర్లు వేస్తున్నారు. అదేవిధంగా సూపర్ హీరో షారుఖ్ ని విమర్శించే అర్హత ఉందా అంటూపాయల్ ను షారుఖ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీనితో ఈవివాదం వేడి పెరిగి తీవ్రం అవుతున్న నేపధ్యంలో పాయల్ రాజ్ పుత్ రంగంలోకి దిగి స్పందించింది.
తాను చేసిన కామెంట్స్ పై వివరణ ఇస్తూ తానూ కూడ షారుఖ్ అభిమానినే అంటూ తాను షారుఖ్ నటన గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కేవలం’జీరో’ సినిమా గురించి మాట్లాడాను అంటూ ‘జీరో’ సినిమా తనకు సెకండ్ హాఫ్ నచ్చలేదు అందుకనే ఈవిధంగా తాను కామెంట్స్ చేసిన విషయాన్ని బయటపెట్టి తనను తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటూ విజ్ఞప్తులు చేస్తోంది.
రాజ్ పుత్ ఎక్స్ పోజింగ్ కు బోల్డ్ పెర్ఫామెన్స్ కు యూత్ బాగా కనెక్ట్ అవుతున్న నేపధ్యంలో ఈమె తన మొదటి సినిమా విజయం తరువాత తన రెండవ సినిమాకే కోటి రూపాయల పారితోషికం అడిగింది. ప్రస్తుతం రవితేజాతో ఒక సినిమాలో నటిస్తున్న ఈమెకు దక్షిణాది సినిమా రంగంలో అనేక ఆఫర్లు వస్తున్నాయి..