ఒకనాటి సీనియర్ హీరో శోభన్ బాబు చనిపోయినా ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాలలో ఆయన అభిమానుల సంఖ్య లక్షల స్థాయిలో కొనసాగుతూనే ఉంది. బుల్లితెర పై శోభన్ బాబు నటించిన అలనాటి సినిమాలు ప్రసారం అయితే ఇప్పటికీ బుల్లితెర ప్రేక్షకులు ఆసినిమాలను చూస్తూనే ఉంటారు. 

శోభన్ బాబు మాట అంటె వెనక్కి తగ్గరు : ముళీమోహన్
ఇటువంటి పరిస్థుతుల నేపధ్యంలో అలనాటి అందాల నటుడు శోభన్ బాబు ఇమేజ్ కి కొందరు క్రేజీ స్టార్స్ అపఖ్యాతికి గురి చేసారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొన్న భాగ్యనగరంలో ‘శోభన్ బాబు సేవాసమితి’ తరపున కొంతమంది ఫిలిం సెలెబ్రెటీలకు అవార్డులు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసారు. 

శోభన్ బాబు మాట అంటె వెనక్కి తగ్గరు : ముళీమోహన్
శోభన్ బాబు పేరిట ఏర్పాటు చేసిన ఈ జీవిత సాఫల్య పురస్కార సభలో కృష్ణంరాజు ప్రకాష్ రాజ్ లతో పాటు మరికొంతమంది క్రేజీ ఫిలిం సెలెబ్రెటీలకు కూడ అవార్డులు ఇచ్చే కార్యక్రమం జరిగింది. క్రిస్మస్ రోజు సెలవు అవ్వడంతో ఆకార్యక్రమానికి ఫిలిం సెలెబ్రెటీలు అంతా వస్తారని ఆశపడి చాలమంది సాధారణ జనం ఆకార్యక్రమానికి విపరీతంగా వచ్చారు. 

అయితే ఆకార్యక్రమానికి కృష్ణంరాజు ప్రకాష్ రాజ్ సీనియర్ నటుడు నరేశ్ తప్ప మరెవ్వరూ రాకపోవడంతో ఆకార్యక్రమానికి వచ్చిన చాలామంది తీవ్ర నిరాశకు గురి అయ్యారు. తమకు అవార్డ్స్ రాకపోయినా చాలమంది ఫిలిం సెలెబ్రెటీలు ఫిలిం ఫెయిర్ అవార్డ్స్ ‘సైమా’ అవార్డ్స్ ఫంక్షన్ కు వెళ్ళడం ఒక ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్న నేపధ్యంలో ఆహ్వానించినా కనీస మర్యాద పాటించకుండా ఈ అవార్డుల ఫంక్షన్ కు చాలమంది క్రేజీ సెలెబ్రెటీలు రాకపోవడం శోభన్ బాబును అవమాన పరచడమే అంటూ ఆకార్యక్రమానికి వచ్చిన చాలామంది కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: