గతంలో టాప్ హీరోలు అంతా పూరీ జగన్నాథ్ తమ సినిమాలకు సంబంధించి కథలు ఎప్పుడు చెపుతాడా అంటూ ఆసక్తిగా ఎదురు చూసేవారు. అయితే ప్రస్తుతం వరస పరాజయాలలో ఉన్న పూరి పరిస్థితి చూసి చాలామంది టాప్ యంగ్ హీరోలు కనీసం పూరి చెప్పే కథలు కూడ వినడానికి ఆసక్తి కనపరచని పరిస్థుతులు గమనిస్తూ ఉంటే పూరి ఇమేజ్ ఏవిధంగా దిగజారిందో అర్ధం అవుతుంది.

ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం హిట్స్ లేని హీరో రామ్ పూరీ జగన్నాథ్ తో ఒక మాస్ సినిమాను చేయాలని నిశ్చయించుకోవడం వెనుక పెద్దకథ నడిచింది అని సమాచారం. వాస్తవానికి ఈసినిమాను రామ్ తన పెదనాన్న స్రవంతి రవి కిషోర్ బ్యానర్ పై చేయాలని ఆరాట పడినట్లు టాక్. 

అయితే స్రవంతి రవికిషోర్ ప్రస్తుతం పూరీకి ఉన్న ఇమేజ్ రీత్యా రామ్ పూరీల కాంబినేషన్ లో సినిమా తీస్తే తనకు మరింత నష్టాలు వస్తాయని వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. దీనితో పూరీని నమ్మే హీరో దొరికినా నిర్మాత దొరకని పరిస్థుతులలో పూరి తానే స్వయంగా రంగంలోకి దిగి తన సొంత బ్యానర్ పై ఈమూవీని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. 

వాస్తవానికి పూరి తన కొడుకు ఆకాష్ తో తీసిన ‘మెహబూబా’ ఘోర పరాజయం చెందడంతో పూరి పీకలలోతు కష్టాలలో ఉన్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో హిట్స్ లేని రామ్ తో కలిసి సాహసం చేస్తూ పూరి ఛార్మి రామ్ లతో కలిసి ఒక సెల్ఫీ దిగి ఒక ‘బోల్డ్ వైల్డ్ ఫిలిం’ మొదలైందని అంటూ ట్విట్ చేసాడు. అయితే ఇలాంటి మాటలు పూరి జగన్నాథ్ నుండి అనేకసార్లు విని మోసపోయిన బయ్యర్లు ఇప్పుడు పూరి లేటెస్ట్ గా చెపుతున్న మాటలను ఎంత వరకు నమ్ముతారు అన్నదే సందేహం..  


మరింత సమాచారం తెలుసుకోండి: