తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య పరభాష హీరోయిన్లు వరుసగా ఛాన్స్ లు కొట్టేస్తున్నారు. అదృష్టం కొద్ది వారు నటించిన చిత్రాలు కూడా సూపర్ హిట్ కావడంతో మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు. ఛలో చిత్రంతో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం మంచి సక్సెస్ కావడంతో విజయ్ దేవరకొండ నటించిన ‘గీతాగోవిందం’చిత్రం లో నటించింది.
ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడమే కాదు వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఆ తర్వాత నాగార్జున, నాని నటించిన ‘దేవదాస్’చిత్రంలో కూడా చాన్స్ కొట్టేసింది ఈ కన్నడ బ్యూటీ. తెలుగు ఇండస్ట్రీలో రష్మిక మందన్నా తక్కువ టైంలోనే ఎక్కువ పాపులారిటీ పొందింది. ఈ అమ్మడు తాజాగా తన ట్విట్టర్లో పలు వీడియోలని షేర్ చేయగా, ఇందులో మూగజీవాలపై ప్రేమని కురిపిస్తూ కనిపించింది.
మై లిటిల్ వన్ అంటూ చిన్న కుక్కతో ఆడుతూ ఉన్న వీడియోతో పాటు నా ‘బిగ్ బాయ్స్’ వీళ్లే అంటూ పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్న వీడియోలని షేర్ చేసింది. పావురం, పిల్లితో దిగిన పలు ఫోటోలని కూడా షేర్ చేసింది. మూగ జీవాలపై రష్మిక చూపిస్తున్న ప్రేమ చాలా గొప్పగా ఉందని ఈ ఫోటోలపై నెటిజన్స్ పలు కామెంట్స్ చేస్తున్నారు.