నిన్నరాత్రి కార్తికేయ పెళ్ళికి సంబంధించిన సంగీత్ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు తమిళ సినిమా పాటలకు ఈ సంగీత్ కార్యక్రమానికి వచ్చిన అతిధులు హీరోలు హీరోయిన్స్ రెచ్చిపోయి డాన్స్ చేసేసారు. ఎన్టీఆర్ రామ్ చరణ్ రానా నాని నాగార్జున అనుష్క లాంటి సెలెబ్రెటీలతో పాటు రాజమౌళి తన భార్య రమతో కలిసి ఒకనాటి అక్కినేని సూపర్ డూపర్ హిట్ మూవీ ‘దసరాబుల్లోడు’ లోని ‘ఎట్టాగ ఉంటాది ఓ అమ్మి... ఏటేటో అవుతాది చిన్నమ్మి' అనే పాటకు రమా రాజమౌళి కలిసి అదిరిపోయే స్టెప్స్ వేసి ఆకార్యక్రమానికి మరింత జోష్ ను పెంచారు.

‘హలో బ్రదర్’ చిత్రంలోని పాటకు నాగార్జున ఎన్టీఆర్ కలిసి డాన్స్ చేయడం ఈ సంగీత్ కార్యక్రమంలోని మరో హైలెట్ అయింది. ఈ కార్యక్రమానికి ముందు ఎంఎం కీరవాణి నిర్వహించిన ఒక క్విజ్ కార్యక్రమంలో ఉపాసన తన సమాధానాలతో అదరగొట్టింది. ఇక ఈ పెళ్ళి వేడుకలలో అతిధులకు రాజస్థాని ఆంధ్ర తెలంగాణ సాంప్రదాయాలకు అనుగుణంగా 72 రకాల వంటలతో ఏర్పాటు చేయబడ్డ విందు కార్యక్రమంలో చిన్న పిల్లలతో సమానంగా జూనియర్ ప్రభాస్ లు పోటీపడి అక్కడి వంటలను రుచి చూస్తూ డైటింగ్ కార్యక్రమానికి ఈమూడు రోజులు సెలవు అంటూ అక్కడి పెళ్లి విశేషాలను షేర్ చేస్తున్నారు. 
ఉపాసన, రామ్ చరణ్
ఇది చాలదు అన్నట్లుగా ప్రభాస్ అనుష్కల సాన్నిహిత్యం ఈ సంగీత్ కార్యక్రమానికి మరొక హైలెట్ గా మారింది. ఇంచుమించు భార్య భర్తలు లానే వీరిద్దరూ కార్తికేయ పెళ్ళిలో వ్యవహరిస్తున్న తీరు ఆ కార్యక్రమానికి వచ్చిన అతిధులు అందర్నీ విపరీతంగా ఆకర్షిస్తోంది. 

దీనికితోడు కార్తికేయ పూజ కూడా కలిసి రెండు పాటలకు స్టెప్స్ వేసారు. అయితే ఈ సంగీత్ కార్యక్రమంలో ఎక్కువగా చిరంజీవి వెంకటేష్ నాగార్జున పాటలు వినిపించాయి కాని బాలకృష్ణ పాటలు లేకపోవడం ఈ కార్యక్రమానికి వచ్చిన మరికొంతమందిని ఆశ్చర్య పరిచింది. ఏది ఎలా చూసుకున్నా కార్తికేయ పెళ్ళి సందడి వార్తలు ఫోటోలతో సోషల్ మీడియా హోరెత్తి పోతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: