నందమూరి బాలకృష్ణ నటవారాసుడు మోక్షజ్ఞ ఫిలిం ఎంట్రీ గురించి గత రెండు సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలకు ఇప్పుడు బాలయ్య స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు. దీనికితోడు మోక్షజ్ఞ గత కొంత కాలంగా అజ్ఞాతవాసం చేస్తున్న నేపధ్యంలో మోక్షజ్ఞ ఏమైపోయాడు అన్న చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
Mokshagna-Latest-Pic-Pouring-Water-on-Fans'-Dreams
కొందరైతే మోక్షజ్ఞ విపరీతంగా లావు అయ్యాడనీ అ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి వైద్యం నిమిత్తం విదేశాలకు వెళ్ళాడు అన్న వార్తలను కూడ ప్రచారం చేసారు.
దీనికితోడు హరికృష్ణ చనిపోయినప్పుడు కానీ ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కానీ మోక్షజ్ఞ కనిపించకపోవడం మరింత ఆశ్చర్య్యాన్ని కలిగించింది. అయితే అందర్నీ ఆశ్చర్య పరుస్తూ మోక్షజ్ఞ మీడియా కెమెరాలకు కంటపడటం సంచలన వార్తగా మారింది. 
Image may contain: 1 person, sunglasses
బాలకృష్ణ సన్నిహితుడు కొర్రపాటి సాయి తెలుగులో డబ్ చేసిన ‘కేజీఎఫ్’ మూవీని ప్రసాద్ ప్రీవ్యూ ధియేటర్ లో బాలకృష్ణ కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు మోక్షజ్ఞ తన తండ్రితో కలిసి రావడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఈమూవీ ప్రత్యేక షోకు బాలయ్యతో కలిసి వచ్చిన మోక్షజ్ఞను చూసినవారు మోక్షజ్ఞ కొంత వరకు సన్నపడ్డాడని కామెంట్ చేస్తున్నారు.
Mokshagna as Vasishtiputra Pulamvi in GPSK
అంతేకాదు సినిమా కెరియర్ పట్ల ఇప్పటి వరకు పెద్దగా ఆసక్తి కనపరచని మోక్షజ్ఞ ఆలోచనలలో మార్పులు వచ్చాయని ఇప్పుడు వెండి తెరమీద హీరోగా మెరవాలని కోరికతో ప్రస్తుతం మోక్షజ్ఞ తన ఫిజిక్ విషయంలో చాల కష్టపడుతున్నాడు అంటూ బాలయ్య సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం. అంతేకాదు 2019లో ఎలాగైనా సినిమా చేస్తాను అని మోక్షజ్ఞ సన్నిహితులతో అంటున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రసాద్ ప్రివ్యూ ధియేటర్ లో మోక్షజ్ఞను చాల దగ్గర నుండి చూసినవారు మాత్రం మోక్షజ్ఞ ఇంకా చాల సన్నపదాలని లేకుంటే ప్రస్తుత పోటీ వాతావరణలో మోక్షజ్ఞ నెగ్గుకు రావడం కష్టం అన్న కామెంట్స్ చేసుకున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: