విలక్షణ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక మైన ఇమేజ్ ఏర్పరుచుకున్న ప్రకాష్ రాజ్ నూతన సంవత్సరం సందర్భంగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటి వరకు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గళం విప్పిన ప్రకాష్ రాజ్ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించాడు.
ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ఈసంచలన నిర్ణయాన్ని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు అంతేకాదు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా తాను ఎన్నికలలో నిలబడ బోతున్నట్లు తాను తీసుకున్న నిర్ణయాన్ని అందరికి తెలియచేసాడు. దీనితో ప్రకాష్ రాజకీయ నాయకులతో ప్రత్యక్ష యుద్ధానికే దిగబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. అయితే తాను ఏరాజకీయ పార్టీలో చేరనని వచ్చే ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్న విషయాన్ని వివరించాడు.
అయితే ఏనియోజకవర్గం నుంచి తాను పోటీచేసేది ప్రకాష్ రాజ్ క్లారిటీ ఇవ్వలేదు. ప్రకాష్ రాజ్ ఇప్పటికే పలువేది పై ఇండియాలో ప్రస్తుతం నెలకొని ఉన్న రాజకీయ అంశాల గురించి తన స్పష్టమైన అభిప్రాయాలు వెల్లడిస్తూ నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలనపై తీవ్ర విమర్శలు కురిపిస్తున్నాడు. ప్రకాష్ రాజ్ ఇప్పటికి నటుడిగా బిజీగా కొనసాగుతూ పలుచిత్రాలలో నటిస్తున్నాడు.
తెలుస్తున్న సమాచారం మేరకు రాబోతున్న ఎన్నికలలో ప్రకాష్ రాజ్ తన సొంత రాష్ట్రం కర్ణాటక ప్రాంతంలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటి చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈమధ్య కాలంలో ఎన్నికల రణరంగంలోకి దిగిన చాలమంది సినిమా నటులు మంచి పేరు ఉన్నా ఓడిపోతున్న నేపధ్యంలో అహంకారానికి చిరునామాగా ఉండే ప్రకాష్ రాజ్ ను నమ్మి జనం ఓట్లు వేస్తారా అన్న విషయం ఈ సంవత్సరం సమ్మర్ లో జరగబోతున్న ఎన్నికలలో తేలిపోతుంది..