అక్కినేని ఫ్యామిలీ నుంచి కింగ్ నాగార్జున తర్వాత ఆయన వారసులు అక్కినేని నాగ చైతన్య, అఖిల్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ‘జోష్’చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఇప్పటి వరకు పలు చిత్రాల్లో నటించారు..కానీ ఇప్పటికీ సరైన హిట్ లభించలేదు. ఇండస్ట్రీలో నాగ చైతన్యకు మంచి క్రేజ్ మాత్రం ఉంది. అంతే కాదు తన సహనటి సమంతను వివాహం చేసుకున్న తర్వాత ఆ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇక బుడి బుడి అడుగులు వేసే సమయంలోనే ‘సిసింద్రి’చిత్రంతో అరంగెట్రం చేసిన అఖిల్ ప్రముఖ దర్శకులు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘మనం’చిత్రంలో క్లయిమాక్స్ లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్ పరంగా మంచి మార్కులే పడ్డా..ఈ చిత్రం మాత్రం సక్సెస్ కాలేదు. ఆ తర్వాత హలో చిత్రంలో నటించాడు..ఈ చిత్రం కూడా కమర్షియల్ పెద్దగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అక్కినేని కుటుంబం అంటేనే కేరాఫ్ రొమాన్స్..ఈ టీజర్ లో కూడా అఖిల్ లవర్ బాయ్ గా అమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్నట్లు కట్ చేశారు.
ఇక యాక్షన్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కానట్టు కనిపిస్తుంది. అక్కినేని కుటుంబం అంటేనే కేరాఫ్ రొమాన్స్. ఒక్క రాత్రిలోనే ఈ సినిమా టీజర్ 2 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అందుకు సంతోషిస్తూ ఈ సినిమా టీమ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రం జనవరి 25వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.