సాయిపల్లవి ధనుష్లో మారి 2 సినిమాలో ధనుష్ సరసన హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమాలో ఓ పాట ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. రౌడీ బేబీ అనే పాటను యూట్యూబ్లో అప్ లోడ్ చేసీ చేయంగానే రికార్డులు సృష్టించడం ప్రారంభించింది.
ఈ పాట అప్లోడ్ చేసిన తొలి రెండు గంటల్లోనే మిలియన్ వ్యూస్ మార్క్ దాటేసిందట. తాజాగా రెండు రోజుల్లో కోటిన్నర వ్యూస్ సొంతం చేసుకుంది. నాలుగున్నర లక్షల మంది లైక్ కొట్టేసారు. ఇంతగా ఈ పాట అలరించడానికి మ్యూజిక్ తో పాటు ధనుష్ , సాయి పల్లవి మధ్య కుదిరిన మ్యాజిక్ కూడా ఓ కారణం.
ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రపీ అందించగా.. యువన్ శంకర్ రాజా స్వరపరిచారు. ఈ వీడియోకు అతి తక్కువ సమయంలో 17 వేలకు పైగా కామెంట్లు రావడం కూడా ఓ రికార్డుగా చెబుతున్నారు. అందుకే ఇది యూట్యూబ్ ట్రెండింగ్లో మూడో స్థానం కొట్టేసింది.
ప్రభుదేవా కొరియోగ్రఫీ టాలెంట్ కు తోడు.. సాయిపల్లవి, ధనుష్ స్టెప్స్ కూడా అదరగొట్టేశారు. చేతులతో బూట్లను ఆడిస్తూ.. నడుస్తున్నట్టు చూపించే సీన్స్.. ఒకరినొకరు పట్టుకుని పడిపోయే స్థాయికి కిందకు వంచుతూ వేసే స్టెప్స్, ధనుష్, సాయిపల్లవి ఎక్స్ప్రెషన్స్ ఈ పాటకు మరింత క్రేజ్ తెచ్చేశాయి.