సంక్రాంతి రేసును టార్గెట్ చేస్తూ బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ కేవలం రెండు రోజుల గ్యాప్ మధ్య విడుదల అవుతున్న నేపధ్యంలో ఈవార్ మెగా నందమూరి ఫ్యామిలీ వార్ గా మారిపోయింది. దీనికితోడు గత కొద్దిరోజులుగా నాగబాబు బాలయ్యను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న పరిస్థుతులలో ఈవార్ పీక్ కు చేరుకుంది. 

దీనితో ఈ రెండు సినిమాల మధ్య వార్ లో ఏసినిమా విజేతగా మారుతుంది అన్న కోణంలో ఏకంగా అభిమానుల మధ్య బెట్టింగ్స్ కూడ జరుగుతున్నాయి అంటే ఈసినిమాల రిజల్ట్ ను నందమూరి మెగా అభిమానులు ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్ధం అవుతుంది. ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న ఒక న్యూస్ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

తెలుస్తున్న సమాచారం మేరకు రామ్ చరణ్ బాలకృష్ణను కలిసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరి కలయికకు సంబంధించిన విషయం లేటెస్ట్ గా జరిగింది కాదనీ కొన్ని వారాల క్రితం ‘వినయ విధేయ రామ’ ‘ఎన్టీఆర్ బయోపిక్’ మూవీలకు సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ఒకే ఫ్లోర్ లో జరుగుతున్నప్పుడు షూటింగ్ గ్యాప్ లో చరణ్ బాలయ్యను కలిసాడు అన్న వార్తలను ఇప్పుడు ఆలస్యంగా ప్రచారంలోకి తీసుకువచ్చారు. 

అయితే ఈ సంఘటన జరిగి ఇన్ని రోజులు గడిచిపోయినా కనీసం వాటికి సంబంధించిన ఫోటోలను కూడ లీక్ చేయకుండా ఎందుకు ఉంచారు అన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది. ఈవిషయమై కొందరు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం మెగా నందమూరి అభిమానుల మధ్య వార్ తీవ్ర స్థాయికి చేరడంతో ఆ వార్ ను చల్లపరచడానికి ఇండస్ట్రీలో ఇలాంటి గాసిప్పులు వ్యూహాత్మకంగా ప్రచారంలోకి తీసుకు వస్తున్నారు అన్న సందేహాలు కూడ వ్యక్తం అవుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: