ఒకనాటి గ్లామర్ క్వీన్ రమ్యకృష్ణ ఇప్పుడు కేరెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సినిమాకు కోటి రూపాయల పారితోషికం తీసుకునే స్థాయిలో కొనసాగుతోంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే తమిళ బుల్లితెర పై అనేక ప్రముఖ సీరియల్స్ లో నటిస్తూ తన హవా కొనసాగిస్తోంది. 

ఇలాంటి క్రేజ్ ను కొనసాగిస్తున్న రమ్యకృష్ణ ఒత్తిడితో నాగార్జున అంతర్మధనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రమ్యకృష్ణ భర్త కృష్ణవంశీ కెరియర్ ఇప్పుడు ఏమాత్రం ఆశాజనంకంగా లేదు అన్నది వాస్తవం. అతడు చెప్పిన కథలు వినడానికి చాలామంది హీరోలు కనీసం ఆసక్తి కూడ కనపరచడంలేదు అంటే కృష్ణవంశీ రేంజ్ ఏస్థాయిలో దిగజారిపోయిందో అర్ధం అవుతుంది.

ఇలాంటి పరిస్థుతులలో కృష్ణవంశీ మరాఠీ సినిమా రంగంలో సంచలనాలు క్రియేట్ చేసిన ఒక సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి చాల ప్రయత్నాలు చేస్తున్నాడు. వాస్తవానికి ఈమూవీలో నటించడానికి ప్రకాష్ రాజ్ అంగీకరించినా ఈమూవీకి మార్కటింగ్ సమస్యలు ఏర్పడతాయని కృష్ణవంశీ ఒక టాప్ హీరో గురించి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో రమ్యకృష్ణ గతంలో నాగార్జునతో అనేక సినిమాలలో కలిసి నటించిన చనువుతో కృష్ణవంశీ సినిమాలో నాగార్జునను హీరోగా చేయమని ఈసినిమాను తానే నిర్మిస్తాను అని నాగార్జున పై ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. 

గతంలో నాగార్జున కృష్ణవంశీతో ‘నిన్నే పెళ్ళాడుతా’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన నేపధ్యంలో అలాంటి సెంటిమెంట్ రిపీట్ చేద్దామని రమ్యకృష్ణ నాగ్ ను కోరుతున్నట్లు సమాచారం. అయితే నాగార్జునకు మాత్రం ఇదే కృష్ణవంశీ కాంబినేషన్ లో గతంలో తాను నటించిన ‘చంద్రలేఖ’ సినిమా జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఇప్పుడు ఈ ప్రయోగం కృష్ణవంశీతో అవసరమా అనే విషయమై ఎటూ తేల్చుకోలేని పరిస్థుతులలో నాగ్ తన నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: