తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే.  క్రిష్, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.   ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్న విషయం తెలిసిందే.  ఈ నెల 9న ఎన్టీఆర్ కథానాయకుడు థియేటర్లోకి రాబోతుంది.  ఇక ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 7న రిలీజ్ చేయబోతున్నారు. 

ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా 'యాత్ర' చిత్రం రూపొందింది. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ  చిత్రంలో వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటించారు.  వైఎస్ పాత్రలో మమ్ముట్టి బాగా ఆకర్షిస్తున్నాడు. ఇక  టీజర్, ట్రైలర్ కి కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది.  అయితే ఈ చిత్రంలో వైఎస్సార్ సతీమణి పాత్రలో  'ఆశ్రిత వేముగంటి' నటించింది. 

బాహుబలి చిత్రంలో నటించిన అశ్రిత ఈ చిత్రంలో విజయమ్మ పాత్రలో నటిస్తుంది. ఆశ్రిత వేముగంటి లుక్ వైఎస్ విజయమ్మకు చాలా దగ్గరగా అనిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ను రిలీజ్ రాబోతున్న విషయం తెలిసిందే.  ఫిబ్రవరి 8వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.  ‘యాత్ర’చిత్రం కోసం వైఎస్సార్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: