తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే. క్రిష్, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 9న ఎన్టీఆర్ కథానాయకుడు థియేటర్లోకి రాబోతుంది. ఇక ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 7న రిలీజ్ చేయబోతున్నారు.
ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా 'యాత్ర' చిత్రం రూపొందింది. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటించారు. వైఎస్ పాత్రలో మమ్ముట్టి బాగా ఆకర్షిస్తున్నాడు. ఇక టీజర్, ట్రైలర్ కి కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది. అయితే ఈ చిత్రంలో వైఎస్సార్ సతీమణి పాత్రలో 'ఆశ్రిత వేముగంటి' నటించింది.
బాహుబలి చిత్రంలో నటించిన అశ్రిత ఈ చిత్రంలో విజయమ్మ పాత్రలో నటిస్తుంది. ఆశ్రిత వేముగంటి లుక్ వైఎస్ విజయమ్మకు చాలా దగ్గరగా అనిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ను రిలీజ్ రాబోతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 8వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘యాత్ర’చిత్రం కోసం వైఎస్సార్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు.