సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏది చేసినా అది సంచలనమే..ఇప్పటి వరకు ఆయన కెరీర్ లో ఎన్నో వివాదాస్పద చిత్రాలు తెరకెక్కించారు.  తాజాగా  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీ పార్వ‌తి కోణంలో తెర‌కెక్కిస్తున్న‌డు. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి..ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు..అసలు లక్ష్మీ పార్వతిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు అన్న అంశాలు ఉండబోతున్నాయట. 

ఇటీవల ఈ చిత్రం నుంచి కుట్ర కుట్ర..వెన్నుపోటు అనే సాంగ్ రిలీజ్ చేసి సంచలనాలు సృష్టించారు.  ఈ చిత్రం నుంచి రెండో పాట ఎందుకు? రిలీజ్ చేశారు.  ఈ పాట‌పై కూడా తొలిసాంగ్ వెన్నుపోటు మాదిరిగానే వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఈ పాట విన్న లక్ష్మీ పార్వతి స్పందిస్తూ..ఎందుకు? అనే పాట తనకు బాధ కలిగించిందని లక్ష్మీపార్వతి తెలిపారు. 

ఈ పాటలో రాంగోపాల్ వర్మ తనని దారుణంగా విమర్శిస్తున్నట్లు ఉందని..వ్యాఖ్యానించారు. అయితే పాట చివరిలో మాత్రం ఇవన్నీ ప్రశ్నలేనని వర్మ చెప్పారన్నారు. మరి ముందు ముందు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎన్ని వివాదాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయనున్నాయో వేచి చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: