చిన్నచిన్న భేదాభిప్రాయాలు ఉన్నా వాటిని ఎక్కడా బయటపడనీయకుండా మెగా ఫ్యామిలీ మెంబర్స్ వ్యవహరిస్తూ ఉంటారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు పండుగ మూడురోజులు బెంగుళూర్ లోని చిరంజీవి ఫామ్  హౌస్ కు వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యులు అందరు పండుగను ఎంజాయ్ చేయడం కొన్ని సంవత్సరాలుగా మెగా ఫ్యామిలీ ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది.
Chiranjeevi
ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప మిగతా మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అంతా సంక్రాంతిని చిరంజీవి ఫామ్ హౌస్ లో కలిసి జరుపుకోవడం ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఆనవాయితి. అయితే ఆ సాంప్రదాయానికి ఈ సంవత్సరం బ్రేక్ పడటంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఈసారి సంక్రాంతికి ఎందుకు అందరు కలవలేదు అన్న అంశం సమాధానం లేని ప్రశ్నగా మారింది. 
Chiranjeevi
‘వినయ విధేయ రామ’ రిజల్ట్ తెలిసిన వెంటనే సంక్రాంతి పండుగకు ఉండకుండా చరణ్ ఉపాసనతో కలిసి అమెరికా వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో తన సొంత ఊరు అయిన పాలకొల్లు వెళ్ళిపోయాడు. వరుణ్ తేజ్ తన సినిమా సక్సస్ ను ఎంజాయ్ చేస్తూ తన ఇంటి పై తన చెల్లెలు నిహారికతో కలిసి గాలిపటాలు ఎగరవేసుకున్నట్లు తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ సంక్రాంతి పండుగకు కూడ హైదరాబాద్ లో లేకుండా అమరావతిలోనే ఉన్నాడు. దీనితో ఈసారి చిరంజీవి హైదరాబాద్ లోని తన ఇంటిలోనే ఉండిపోయి సంక్రాంతిని జరుపుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Sisters
ఈమధ్య కాలంలో ఎప్పుడు ఇలా విడివిడిగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ సంక్రాంతి జరుపుకున్న సందర్భాలు లేవు అని అంటున్నారు. చిరంజీవి ఇంట్లో జరిగే సంక్రాంతి సరదాలకు మెగా ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరు రాకపోయినా చిరంజీవికి కోపం వచ్చేది అన్న విషయం నాగబాబు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాంటి చిరంజీవి బెంగుళూరు ఫామ్ హౌస్ లో ఈసారి సంక్రాంతి సరదాలు జరగకపోవడం వెనుక కారణం ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: