తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బాలనటిగా ప్రవేశించి ‘పదహారేళ్లవయసు’చిత్రంతో హీరోయిన్ గా మారిన శ్రీదేవి..రెండు తరాల హీరోలతో హీరోయిన్ గా నటించారు.  మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో నటించిన శ్రీదేవి తర్వాత తరం నాగార్జున, వెంకటేష్ లతో కూడా నటించి మెప్పించారు.  తెలుగు లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతున్న సమయంలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ ప్రొడ్యూసర్ బోనికపూర్ ని వివాహం చేసుకుంది. 

ఈ దంపతులకు జాన్వి కపూర్, ఖుషీ కపూర్ లు జన్మించారు.  కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చిన శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.  కానీ దురదృష్ట వశాత్తు ఓ వివాహ వేడుకకు వెళ్లిన శ్రీదేవి అనుకోకుండా మరణించారు.  ఆమె కూతురు జాన్వి ప్రస్తుతం హీరోయిన్ గా రాణిస్తుంది.  ధడక్ చిత్రంతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన జాన్వి తల్లికి తగ్గ తనయగా మంచి మార్కులే కొట్టేసింది. 

తొలి చిత్రం 'ధడక్'లో తన డ్యాన్స్ నైపుణ్యాన్ని చూపింది. అందంతో పాటు అభినయంలోనూ పేరు తెచ్చుకున్న ఆమె, త్వరలో పాల్గొనే ఓ కార్యక్రమం కోసం తన కొరియోగ్రాఫర్ తో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా, ఈ వీడియోను ప్రముఖ కొరియోగ్రాఫర్ సంజయ్ షెట్టి, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, జాన్వి శ్రీదేవిని గుర్తు చేస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: