‘రంగస్థలం’ తరువాత ఒక ఏడాది గ్యాప్ తీసుకుని సుకుమార్ మహేష్ తో తీయబోతున్న సినిమాకు సంబంధించి అనేక చర్చలు తరువాత కథ ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈకథ ఫైనల్ అవ్వడంతో సుకుమార్ తన రైటింగ్ టీమ్ తో కలిసి ఈమూవీకి సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ ను పూర్తి చేసే హడావిడిలో ఉన్నట్లు సమాచారం. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ కథ అంతా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందని తెలుస్తోంది. దీనితో ఈమూవీ షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో మే నెలలో మొదలుపెట్టి వర్షాకాలం రాకుండానే ఈమూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేయడానికి సుకుమార్ అప్పుడే ఏర్పాట్లు కూడ మొదలుపెట్టినట్లు టాక్. ఈకథ మొత్తం ఒక రివెంజ్ డ్రామాగా నడుస్తుందని తెలుస్తోంది. 

ఈసినిమా కథలో అక్కడక్కడ రాబిన్ హుడ్ పాత్రకు సంబంధించిన పోలికలు కనిపించినా ఇప్పటి తరం ప్రేక్షకులకు ఆపోలిక కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. గతంలో సుకుమార్ ‘1 నేనొక్కడినే’ మూవీ విషయంలో జరిగిన పరాభవాన్ని మనసులో పెట్టుకుని ఎక్కడా మితిమీరిన ఆత్మ విశ్వాసం ప్రదర్శించకుండా మహేష్ కు ఒక ‘రంగస్థలం’ లాంటి టాప్ హిట్ ను ఇవ్వడానికి ఈమూవీ స్క్రీన్ ప్లే విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈమధ్య కాలంలో టాప్ హీరోలు ఎవ్వరూ కౌ బాయ్ తరహా పాత్రలు పోషించలేదు కాబట్టి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ను ఈసినిమా కోసం సుకుమార్ వ్యూహాత్మకంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన పాత్రల విషయంలో సుకుమార్ కు ఒక క్లారిటీ రావడంతో ఈసినిమాలో నటించే నటీనటులతో పాటు ఒక డిఫరెంట్ విలన్ కోసం సుకుమార్ అన్వేషణ జరుపుతున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: