సాధారణంగా స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం చాలా రేర్ గా జరుగుతుంది. ఏదో ఒక సినీ వేడుకల్లో కొంత మంది స్టార్ హీరోలు హాజరు కావడం ఆ టాప్ హీరోలను ఒకే వేధికపై ఫోటో క్లిక్ మనిపించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. చిన్న హీరోల చిత్రాల ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు సైతం పెద్ద హీరోలు హాజరు కావడం..వారికి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అంతే కాదు ఇప్పుడున్న యువ హీరోలు చాలా ఫ్రేండ్లీ నేచర్ తో ఉండటం చూస్తూనే ఉన్నాం.
చిన్నా, పెద్ద చిత్రాలు ఏవైనా సరే మంచి సక్సెస్ సాధిస్తే ఆ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలుపుతూ వారిని ఉత్తేజపరుస్తున్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, రానా, అఖిల్ .. వీరంతా మంచి స్నేహితులు. తరచూ కలుస్తూ పార్టీలు చేసుకుంటుంటారు. తాజాగా అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ మజ్ను’.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా అఖిల్, చరణ్, ఎన్టీఆర్ ముగ్గురూ కలిశారు. తాజాగా ఈ ముగ్గురు స్టార్లు ఒకే ఫ్రేములో ఉండటంతో అభిమానులు ఆ ఫోటోను తెగ షేర్ చేస్తూ ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఇకపోతే అఖిల్ కొత్త సినిమా 'మిస్టర్ మజ్ను' ఈ శుక్రవారం విడుదలకానుండగా చరణ్, తారక్ ఇద్దరూ కలిసి ఒక మల్టీ స్టారర్ చేస్తున్నారు.