తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున వారసులుగా అక్కినేని నాగ చైతన్య, అఖిల్ లు హీరోలుగా పరిచయం అయ్యారు. వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ డ్యాన్స్, యాక్షన్ విషయంలో మంచి మార్కులే కొట్టేశాడు. కానీ ఈ చిత్రం మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘హలో’చిత్రంలో నటించాడు. ఈ చిత్రం కథా పరంగా ఆకట్టుకున్నా కమర్షియల్ గా హిట్ కాలేదు. తాజాగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో అఖిల్ నటిస్తున్న మూడో చిత్రం ‘మిస్టర్ మజ్ను’.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్స్ ను ఇతర దేశాల్లో ముందు ప్రదర్శించగా కాస్త పాజిటీవ్ టాక్ వస్తుంది. విదేశాల్లో ఉండే నిక్కీ (నిధి అగర్వాల్) - విక్కీ (అఖిల్) ఇండియాకు వచ్చి ఒక ఫ్యామిలీ వెడ్డింగ్ తో కలుసుకుంటారు. మొదటి నుంచి విక్కీ జాలీగా ఉంటూ..లవర్ బాయ్ గా అందరి అమ్మాయిల మనసు దోచేస్తుంటాడు. వారితో లాంగ్ రిలేషన్ తో ఉండకుండా వెంటనే బ్రేకప్ చెప్పేస్తుంటాడు. ఇక రాముడు లాంటి భర్త కావాలని నిక్కీ కోరుకుంటుంది. ఇక నిక్కీ తో ట్రావెలింగ్ అనంతరం మ్యారేజ్ సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా బాగానే కనెక్ట్ అవుతాయి. అఖిల్ చిలిపి తనాన్ని చూపిస్తూనే ఎమోషనల్ సీన్స్ ను కరెక్ట్ గా ఎలివేట్ చేసినట్లు అనిపిస్తుంది.
ప్లే బాయ్ లా ఉండే విక్కీ ఫ్యామిలీ హీరోగా మారిపోతాడు. ఫ్యామిలీ సీన్స్ తో పాటు కామెడీ ఎంటర్టైన్మెంట్ సీన్స్ ని కూడా యాడ్ చేసి ఫైనల్ గా డైరెక్టర్ గుడ్ ఫిల్మ్ ను ఇచ్చాడని చెప్పవచ్చు. లవ్ స్టోరీ అక్కడక్కడా కొంచెం రొటీన్ గానే అనిపిస్తోంది. మ్యూజిక్ విషయంలో మాత్రం థమన్ ఈసారి అంతగా మెప్పించలేకపోయాడు. కెమెరా పనితనం స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇక అఖిల్ మరోసారి తన డ్యాన్స్, ఫైట్స్ తో మెప్పించాడు. అఖిల్ ఈ సారి హిట్టు కొట్టేలా ఉన్నాడని టాక్ వస్తోంది. మరి ఈ చిత్రం రిజల్ట్ సాయంత్రం వరకు ఎలా ఉండబోతుందో..హిట్టా..ఫట్టా అన్న విషయం తెలిసి పోతుంది.