యూత్ కు ఐకాన్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ తాను ఎంచుకునే సినిమాల విషయంలోనే కాకుండా తన వ్యక్తిగత జీవితంలో కూడ చాలా డిఫరెంట్ గా ఉంటాడు. ఇలాంటి పరిస్థుతుల నేపథ్యంలో 'సిగ్నేచర్ మాష్టర్ క్లాస్' కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారడం ప్రస్తుతం హాట్ న్యూస్ గా మారింది. యూత్ లో ఆత్మవిశ్వాసం కలిగించి వారికి సమస్యలను ఎదుర్కొనే ధైర్యం కలిగించే కార్యక్రమంగా ఈ ప్రోగ్రామ్ ను భాగ్యనగరంలో కొందరు నిర్వహిస్తూ ఆకార్యక్రమానికి 'సిగ్నేచర్ మాష్టర్ క్లాస్' అన్న పేరు పెట్టడమే కాకుండా దానికి బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండను నియమించి వివరీతమైన ప్రచారం చేస్తున్నారు. 

యూత్ ఏదైనా ఒక రంగంలో రాణించాలి అంటే ఎటువంటి సపోర్ట్ కానీ గాడ్ ఫాదర్స్ కానీ అక్కరలేదు అని చెపుతూ నేటి తరానికి దిశా నిర్దేశం చేసే ఈకార్యక్రమానికి విజయ్ దేవరకొండ పిలుపుతో విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. అనేక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్న ఈకార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ మారడం అతడి స్టామినాను సూచిస్తోంది. 

ఇది ఇలా ఉండగా విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా ఒప్పుకున్న ఒక సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ మూవీని చేస్తున్న విజయ్ ఈమూవీ చిత్రీకరణ ముగిసిన వెంటనే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. అయితే ఆసినిమాతో పాటుగా విజయ్ మరొక సినిమాను లైన్ లో పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఒక తమిళ దర్శకుడు విజయ్ కు చెప్పిన ఒక విచిత్రమైన కథకు విజయ్ ఓకె చేసాడని టాక్. ఈకథలో విజయ్ హీరో అయినప్పటికీ ఈకథ మొత్తం ఒక మోటార్ బైక్ చుట్టూ తిరుగుతూ కొద్దిగా 'టాక్సీవాల' ఛాయలు ఉంటాయని తెలుస్తోంది. ఈసినిమా కథ విజయ్ కు బాగా నచ్చడంతో ఈమూవీని మైత్రి మూవీస్ బ్యానర్ పై ఉంటుందని టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: