తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోలు కొద్ది మందే ఉన్నారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో తమిళ హీరోలు రజినీ,కమల్ తర్వాత విజయ్,అజిత్, సూర్య, ధనుష్, కార్తీ లాంటి హీరోలు తమ సత్తా చాటుతున్నారు. తమిళ్ లో హిట్ అయిన చిత్రాలు తెలుగు లో డబ్ చేస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు హీరో ధనుష్ నటించిన ‘అసురన్’చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇటీవల ధనుష్, సాయి పల్లవి నటించిన మారి 2 చిత్రం తెలుగు లో మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
తమిళ్ లో మాత్రం మంచి విజయం అందుకుంది. తాజాగా ధనుశ్ కథానాయకుడిగా తమిళంలో 'అసురన్'చిత్రం నిర్మితమవుతోంది. వెట్రి మారన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో రూపొంతుంది ఈ చిత్రం. నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా 'అసురన్' ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.
ఈ ఫస్టులుక్ పోస్టర్ లో ధనుశ్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. బ్లాక్ కలర్ బనీను .. గళ్ల లుంగీ పైకి కట్టి .. బల్లెంతో దాడికి దిగుతున్నట్టుగా ఈ పోస్టర్ లో ఆయన కనిపిస్తున్నాడు. ఈ రోజు నుంచే ఈ సినిమా షూటింగ్ మొదలవుతోంది. ఈ చిత్రంలో మాలీవుడ్ బ్యూటీ మంజువారియర్ కీలక పాత్రలో నటిస్తుంది. ఓ తమిళ నవల ‘వెట్కాయ్’ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రానికి కలై పులి థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.