హీరో గోపీచంద్ కెరియర్ గతకొంత కాలంగా ఏమాత్రం బాగాలేదు. ‘లౌక్యం’ సినిమా తరువాత హిట్ అనేపదం గోపీచంద్ వంక చూడటం లేదు. నటుడుగా ఎంత కష్టపడి ప్రయత్నించినా గోపీ చంద్ కు ప్రతి సినిమాలోను నిరాశ ఎదురౌతోంది. 
వాటిని నమ్మెద్దు.. అవిన్నీ రూమర్లే:  గోపీచంద్
ఇలాంటి పరిస్థుతులలో గోపీచంద్ ఒక భారీబడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో నిర్మింప బడుతున్న ఈసినిమాను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మిస్తున్నాడు.

ఈసినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ ను తాజాగా ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లో చిత్రీకరించారు. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం లక్ష్మీ రాయ్ మరియు హంసా నందినిని సంప్రదించారట. ఇప్పటికే వీరిద్దరు చాల సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేసుకుంటూ కొనసాగుతున్న నేపధ్యంలో వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ సెకండ్ హీరోయిన్ పాత్రకు ఒప్పుకుంటారని ఈమూవీ దర్శకుడు భావించాడట.

ఇద్దరు కలిసి మసాలా ఫీస్ట్ ఇవ్వబోతున్నారట..!
అయితే ఈమూవీ దర్శక నిర్మాతలకు షాక్ ఇస్తూ తాము గోపీచంద్ పక్కన సెకండ్ హీరోయిన్ గా నటించాలి అంటే తమకు పారితోషికంగా 50 లక్షలు కావాలి అని అడిగినట్లు టాక్. ఈమధ్య కాలంలో గోపీచంద్ కు సక్సస్ లు లేకపోవడంతో ఈ హీరోతో నటించాలి అంటే తమకు ఆస్థాయిలో పారితోషికం కావాలి అని హంసా నందిని మరియు రాయ్ లక్ష్మిలు కోరినట్లుగా తెలుస్తోంది. దీనితో చేసేదిలేక బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ ను సంప్రదిస్తే ఆమె మరో మాట చెప్పకుండా గోపీ చంద్ పక్కన నటించడానికి 20 లక్షలకు ఒప్పుకున్నట్లు టాక్. దీనితో గోపీచంద్ రేంజ్ బుకింగ్స్ లేని హంస నందిని లక్ష్మీరాయ్ లకు సరిపోలేదా అంటూ సెటైర్లు పడుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: