సినిమాలకు దూరమై రాజకీయాలలో కొనసాగుతున్న విజయశాంతి రానున్న పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయాలని చాల తాపత్రయ పడుతోంది. ఇలాంటి పరిస్థుతులలో ఈమె ఆంధ్రప్రదేశ్ లో పవన్ జగన్ లను కలపడానికి టిఆర్ఎస్ అధినాయకత్వం ప్రయత్నిస్తోంది అంటూ ఆమె చేసిన ట్విట్ హాట్ టాపిక్ గా మారింది.

గత వారం జరిగిన రిపబ్లిక్ డే సందర్భంగా రాజభవన్ లో పవన్ కేసీఆర్ ల మధ్య జరిగిన ముచ్చట్ల గురించి స్పందిస్తూ విజయశాంతి ఈ ట్విట్ చేసింది. అంతేకాదు కొంతమంది పవన్ కళ్యాణ్ ను అనవసరంగా వివాదాలలోకి లాగడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అలాంటి ఉచ్చులోకి పవన్ చిక్కుకుంటే ‘జనసేన’ కు ప్రజారాజ్యం కంటే ఘోరమైన అవమానం ఎదురయ్యే పరిస్థుతులు పొంచి ఉన్నాయి అంటూ విజయశాంతి పవన్ కు హెచ్చరికలు చేస్తోంది.

అయితే పవన్ కళ్యాణ్ అంత తొందరగా కొంతమంది రాజకీయ ప్రముఖులు వేస్తున్న ఉచ్చులోకి ఇరుక్కుంటాడని తాను అనుకోవడంలేదని అయితే అనుకోకుండా పవన్ వ్యూహాత్మక తప్పులు చేస్తే ‘జనసేన’ కు అనుకున్న ఓట్లు కూడ పడవు అంటూ పవన్ కు తన అభిప్రాయాన్ని హెచ్చరికల రూపంలో తెలియచేస్తోంది ఈ రాములమ్మ. దీనితో చిరంజీవి పై విపరీతంగా విమర్శలు చేసే విజయశాంతికి పవన్ పై అభిమానం ఎందుకు కలిగింది అన్న విషయమై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

ఇది ఇలా ఉండగా పవన్ ఎవరూ ఊహించని విధంగా రాబోతున్న ఎన్నికలకు చాల ముందుగా అభ్యర్ధులను వరస పెట్టి ప్రకటిస్తూ ప్రముఖ రాజకీయ పార్టీలకు షాక్ ఇస్తున్నాడు. దీనికితోడు ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థ సహకారంతో పవన్ వచ్చే ఎన్నికలలో తాను ఏలూరు పిఠాపురం గాజువాక స్థానాలలో ఏస్థానం నుండి పోటీ చేస్తే తనకు విజయం ఖచ్చితంగా వస్తుంది అన్న విషయమై క్లారిటీ రావడానికి ఒక రహస్య సర్వే చేయించుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: