బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల కూతుళ్లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు.  విలన్, కామెడీ, క్యారెక్టర్ పాత్రల్లో నటించి మెప్పించిన శక్తికపూర్ కూతురు  శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వరుస హిట్స్ తో మంచి పోజీషన్ లోకి వెళ్లింది.  ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘సాహూ’చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.  సాధారణంగా హీరో, హీరోయిన్లు తమను అభిమానించే వారిని కలుస్తూ వారి బాగోగులు తెలుసుకొని ఏవైనా ఆర్థిక కష్టాలు ఉన్నవారు..హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వారికి ఆర్ధిక సాయాన్ని అందించడం జరుగుతుంది.  మరికొంత మంది బాధల్లో ఉన్నవారిని స్వ‌యంగా క‌లిసి కావ‌ల‌సినంత ధైర్యాన్ని ఇస్తున్నారు.
Related image
తాజాగా బాలీవుడ్ భామ‌, సాహో బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్.. సుమ‌య్య అనే చిన్నారిని క‌లిసి ఆమెని సంతోష‌ప‌ర‌చింది.  సుమయ్య అనే చిన్నారి కెట్టో అనే ఎన్జీవో ద్వారా వైద్యం పొందుతుండ‌గా, బాలిక మ‌న‌సులోని కోరిక‌ని ప్ర‌ముఖ న‌టి శ్ర‌ద్ధాకి ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది ఆ సంస్థ.  ట్విట్టర్ లో సందేశానికి వెంటనే స్పందించిన శ్ర‌ద్ధా త‌న అభిమానిని ఎలా క‌ల‌వాలో చెప్పండంటూ రీ ట్వీట్ చేసింది. అంతేకాదు త‌న అభిమానిని వ్య‌క్తిగ‌తంగా క‌లవాల‌ని భావించిన ఈ అమ్మ‌డు అభిమానులెవ‌రు గుర్తు ప‌ట్ట‌కుండా ఉండేందుకు బుర్ఖా ధ‌రించి బాలిక చికిత్స పొందుతున్న ఎన్జీవోకు వెళ్లారు.
Image result for shraddha kapoor saina nehwal
హాస్పిటల్ లో శ్రద్దను చూసి అందరూ ఆశ్చర్యపోయారు..ఆ చిన్నారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ చిన్నారితో స్టాఫ్ తో శ్రద్ద ఫోటోలు దిగింది. సుమ‌య్య‌ని క‌లిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని దేవుడ‌ని ప్రార్ధిస్తున్నాను. త‌న‌కి నేను ఎలా సాయ‌ప‌డాలో చెప్పండి. మీ సంస్థ‌(కెట్టో)కి సంబంధించిన వారు చాలా గొప్ప‌గా ప‌ని చేస్తున్నారు అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం శ్రద్ద కపూర్ ‘సాహూ’, సైనా నెహ్వాల్ బ‌యోపిక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: