తెలుగు సినిమాలకు సంబంధించి అక్క వదిన తల్లి ఆంటీ పాత్రలకు చిరునామాగా కొనసాగుతున్న హేమ ఏదైనా ఒక విషయం పై స్పందించాలి అంటే ఎటువంటి మొహమాటాలు లేకుండా మాట్లాడుతుంది. ఇలాంటి పరిస్థుతులలో ఆమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని వివాదాస్పద విషయాలు మాట్లాడినట్లు ఆఇంటర్వ్యూ ప్రోమోను బట్టి సంకేతాలు వస్తున్నాయి. 
 త్రివిక్రమ్‌తో విభేదాలు
ఒక సినిమాకు సంబంధించి 100 టిక్కెట్లు హీరోను చూసి అమ్మకం జరిగితే మరో 15 టిక్కెట్లు ఆసినిమాలోని తన పాత్రను చూసి అమ్మకం జరుగుతాయని అంటూ ‘వినయ విధేయ రామ’ మూవీ ఫెయిల్ అయినా ఆసినిమాలో తన పాత్ర ప్రేక్షకులలో మంచి పేరును తీసుకు వచ్చింది అంటూ కామెంట్స్ చేసింది. ఇదే సందర్భంలో గతంలో త్రివిక్రమ్ తీసే ప్రతి సినిమాలోను నటించే తాను ఈమధ్య త్రివిక్రమ్ సినిమాలలో కనిపించక పోవడానికి గల కారణాలు వివరిస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. 
మండపేట బరిలో సినీ నటి హేమ - Sakshi
ఒక సినిమాకు సంబంధించి రెమ్యూనరేషన్ విషయంలో తనకు త్రివిక్రమ్ తో అభిప్రాయ భేదాలు వచ్చాయని దీనితో బహుశా త్రివిక్రమ్ తన పై కోపం పెంచుకుని ఉంటాడు అని కామెంట్ చేస్తూ ప్రస్తుతం త్రివిక్రమ్ ఎదురుగా వస్తున్నా తాను పక్కకు తప్పుకుని వెళ్ళిపోతున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇదే సందర్భంలో పూరి జగన్నాథ్ ను దృష్టిలో పెట్టుకుని ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. 
character artist hema reveals secrets of tollywood
తనకు పూరిజగన్నాథ్ తో మంచి సాన్నిహిత్యం ఉంది అని చెపుతూ ప్రస్తుతం పూరి జగన్నాథ్ మబ్బు పట్టిన సూర్యుడులా మారిపోయాడు అంటూ ఆ మబ్భులు తొలిగితే కాని పూరీకి పూర్వ వైభవం రాదు అంటూ హేమ చేసిన కామెంట్స్ ఎవరికి సంకేతం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోలోనే ఇన్ని సంచలనాలు ఉంటే అసలు ఇంటర్వ్యూలో ఇంకెన్ని సంచలనాలు ఉంటాయో అన్న ఆసక్తి పెరిగిపోతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: