ఎన్టీఆర్ సినిమాకు మంచి రివ్యూలు వచ్చినా ఆ సినిమా పంపిణీదారులకు భారీ నష్టాలే మిగిల్చింది. ఈ విషయం ఇప్పటికే ప్రముఖంగా వచ్చినా అదంతా నెగిటివ్ ప్రచారం అని ఆ సినిమా వర్గాలు సమర్థించుకున్నాయి. కానీ ఇప్పుడు తెలుగులోని ప్రముఖ పత్రిక కూడా ఎన్టీఆర్ నష్టాలను మిగిల్చిందని తేల్చి చెప్పింది.
ఎన్టీఆర్’కి
మంచి ఓపెనింగ్స్ లభించినా
బాక్సాఫీసు దగ్గర నిలదొక్కుకోలేకపోయిందని
ఆ పత్రిక విశ్లేషించింది.
ఎన్టీఆర్గా
బాలయ్య అభినయాన్ని,
క్రిష్
దర్శకత్వ ప్రతిభని మెచ్చుకున్నా
ప్రేక్షకుల నుంచి సరైన స్పందన
లభించలేదని తెలిపింది.
మొత్తంగా
చూస్తే పంపిణీదారులకు ఈ చిత్రం
నష్టాన్నే మిగిల్చింది అని
అసలు విషయం చెప్పేసింది.
ఇక
రామ్చరణ్ -
బోయపాటి
శ్రీను కలయికలో వచ్చిన ‘వినయ
విధేయ రామ’ అంచనాల్ని తలకిందులు
చేసిందని విశ్లేషించింది.
కథ
కథనాలలో కొత్తదనం కనిపించకపోవడం,
యాక్షన్
సన్నివేశాల్లో లాజిక్కులు
మిస్సవ్వడం ఈ చిత్రానికి
శాపంగా మారాయని అభిప్రాయపడింది.
విడుదలకు
ముందు దాదాపు రూ.వంద
కోట్ల బిజినెస్ చేసిన ఈ
చిత్రం,
అందులో
సగం కూడా రాబట్టుకోలేదని
సదరు ప్రముఖ పత్రిక తెలిపింది.