ఈ మద్య వెండితెర, బుల్లితెరపై ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వెండి తెరపై కానీ, బుల్లితెరపై కానీ ఒక్కసారైనా కనిపిస్తే చాలు జీవితం ధన్యం అవుతుందని ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు అనుకుంటారు. అందుకోసం స్టూడియోల వెంట పడిగాపులు పడుతూ నానా కష్టాలు పడుతుంటారు. ఒక్కసారి ఛాన్స్ వచ్చిందంటే..సెలబ్రెటీ హోదాలో ఆనంద పడుతుంటారు. కానీ కొంత మంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా జీవితంపై విరక్తితో ఆత్మహత్యలు చేసుకున్నావారు ఉన్నారు.
తాజాగా బుల్లితెరపై పలు సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది. బుల్లితెరపై పలు సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఝాన్సీ. శ్రీనగర్ కాలనీలోని సాయి అపార్ట్మెంటలో నివసిస్తున్న ఆమె ప్రేమ విఫలం కారణంగా ఈ రోజు ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటనే దానిపై పోలీసుల దర్యాప్తు జరుపుతున్నారు. మా టీవీలో ప్రసారమయ్యే పవిత్ర బంధం సీరియల్తో పాటు పలు టీవీ సీరియల్స్లో నటిస్తుంది ఝాన్సీ.