తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో కొనసాగుతున్న నయన తార దక్షిణాదిన ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. మొదట గ్లామర్ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించిన నయన్ ఈ మద్య లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తుంది. పాత్రకి ప్రాధాన్యం ఉంటే ఎలాంటి రోల్ అయిన చేసేందుకు ఈ అమ్మడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది.
‘ఓకే ఓకే ’ఫేమ్ ఎమ్ రాజేష్ తెరకెక్కిస్తున్న మిస్టర్ లోకల్ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న నయనతార ఇటీవల తన పార్ట్కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకుంది. తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిన సందర్భంగా తనకు ఎంతో సహకరించిన చిత్ర యూనిట్ కి సర్పైజ్ గిఫ్ట్ ఇచ్చి సంతోష పెట్టింది నయన్.
చిత్ర యూనిట్కి సంబంధించిన వారందరికి ఫాసిల్ కంపెనీ వాచ్లని గిఫ్ట్గా అందించింది. గతంలో కీర్తి సురేష్ కూడా తన చిత్ర యూనిట్ కి గోల్డ్ కాయిన్స్ ను గిఫ్ట్ గా ఇచ్చిన విషయం తెలిసిందే. నయన్ ఇచ్చిన గిఫ్టులు చూసి చిత్ర యూనిట్ తెగ సంతోష పడుతున్నారు. యనతార నటించిన మిస్టర్ లోకల్ చిత్రంలో శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించారు. హిప్ హాప్ సంగీతం అందించారు. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.