తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో తో హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది అనసూయ. అప్పటి వరకు యాంకర్లు కట్టూ..బొట్టు స్టైల్ మార్చేసింది. హాట్ లుక్ తో మత్తైన మాటలతో కుర్రాళ్ల మతులు పొగొట్టిన అనసూయకు ‘సోగ్గాడే చిన్నినాయన’చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘క్షణం’చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాలు అనసూయకు పెద్దగా పేరు తీసుకు రాలేదు. గత సంవత్సరం సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’చిత్రంలో రంగమ్మత్తగా నటించి మంచి పేరు తెచ్చుకుంది.
ఈ చిత్రంలో అనసూయ డి గ్లామర్ గా కనిపించిన విషయం తెలిసిందే. ఈ మద్య యాత్ర చిత్రంలో గౌరు చరితా రెడ్డి పాత్రలో కనిపించింది. చీర కట్టుతో ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తూ గ్లామర్ కి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అంతే కాదు చిన్న చిన్న పాత్రల్లో కనిపించడంతో అనసూయకు పెద్దగా పేరు కూడా రావడం లేదు. ఇటీవల విడుదలైన 'ఎఫ్ 2' చిత్రంలో కూడా అనసూయ పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు.
కథ ప్రకారం ఆ పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడంతో క్యారెక్టర్ పెద్దగా క్లిక్ అవ్వలేదు. అసలు ఇలాంటి పాత్రలో అనసూయ ఎలా చేసిందంటూ కామెంట్స్ వచ్చాయి. ఇలా చిన్న చిన్న పాత్రలకే పరిమితం అయితే ఇండస్ట్రీలో ఏమాత్రం పేరు రాదు కదా..మొత్తమే కనుమరుగవుతారని..మరి అనసూయ ఇలా ఎందుకు చేస్తుందని ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు.