పారిశ్రామిక వేత్త జయరామ్ హత్య కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. కేసు తెలంగాణ పోలీసుల చేతికి వచ్చినప్పటి నుంచి జోరుగా విచారణ సాగిస్తున్నారు. తాజాగా ఈ కేసులో అనేక సంచలన విషయాలు వెలుగు చూశాయి.
జయరామ్ హత్య కేసులో సినీనటుడు సూర్యకు పాత్ర ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సూర్య అంటే సీనియర్ నటుడు కాదండోయ్.. ఆ నలుగురు సినిమాలో రాజేంద్రప్రసాద్ కొడుకుగా నటించిన యువ నటుడు సూర్య.
జయరామ్ కాల్ లిస్టులో ఇతని పేరు కూడా ఉంది. హంతకుడు రాకేశ్ తో ఇతను ఎందుకు మాట్లాడాడు.. హంతకుడికీ సూర్యకూ ఏంటి సంబంధం అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నటుడు సూర్యను పిలిపించి విచారించారు.
ఈ విషయంలో సూర్య ప్రసాద్ పోలీసులకు ఎలాంటి వివరణ ఇచ్చారన్న విషయం ఇంకా తెలియడం లేదు. రాకేశ్ కు సినీ పరిశ్రమతో సంబంధాలు ఉన్నందువల్ల రొటీన్ గానే కాల్ చేసి ఉండొచ్చు.. కాకపోతే హత్య జరిగిన తర్వాత సూర్య ప్రసాద్ తో మాట్లాడినందు వల్ల పోలీసులు అనుమానించారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.