ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ వ్యూహాల్లో ఆరితేరినవాడే..అందుకే ఎలాంటి నాయకుడినైనా వ్యూహాలతో ఎదుర్కొంటారు. కానీ ఆయనకు ఇప్పుడు సినిమా దర్శకులు ప్రత్యర్థులుగా మారారు. ఇటీవల విడుదలైన యాత్ర సినిమా, విడుదల కాబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఈ రెండూ.. చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నాయని చెప్పొచ్చు.



జగన్ పార్టీకి ఉన్న గొప్ప ఆయుధం.. వైఎస్సార్.. వైఎస్ వారసత్వమే జగన్‌కు అండగా నిలుస్తోంది. మరి అలాంటి వైఎస్ చనిపోయి దాదాపు పదేళ్లవుతోంది. దాంతో వైఎస్ ను జనం మరిచిపోయే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ వైఎస్ గొప్పదనాన్ని గుర్తు చేస్తూ సాగిన యాత్ర సినిమా ఎన్నికల ముందు కచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది.



ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపంలో రామ్ గోపాల్ వర్మ చంద్రబాబుపై పగబట్టినట్టే ఉన్నాడు. నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూస్తే మరోసారి ఎన్టీఆర్ కు చంద్రబాబు చేసిన ద్రోహం హైలెట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు చాలా మంది చంద్రబాబు చేసిన ద్రోహం మరిచిపోయి టీడీపీ కార్యకర్తలుగా కొనసాగారు.



ఇప్పుడు ఈ సినిమాతో వాళ్లు మరోసారి ఆలోచించుకునే అవకాశం ఉంది. వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ తో పాటు మరిన్ని సీన్లు చంద్రబాబు కుటిలత్వాన్ని బాగానే ఎస్టాబ్లిష్ చేసేలా ఉన్నాయి. ఈ రెండు సినిమాలూ సరిగ్గా ఎన్నికలకు ముందు విడుదల కావడం చంద్రబాబుకు ఇబ్బంది కరంగా మారుతోంది. దీనికి విరుగుడుగా చంద్రబాబు ఏం చేస్తారో..?


మరింత సమాచారం తెలుసుకోండి: