‘కధానాయకుడు’ ఫెయిల్యూర్ షాక్ నుండి ఇంకా బాలకృష్ణ కోలుకోకుండానే ‘మహానాయకుడు’ ట్రైలర్ విషయంలో కూడ బాలకృష్ణకు ఊహించని షాక్ తగిలింది. ‘మహానాయకుడు’ ట్రైలర్ ఏమాత్రం బాగాలేదు అని వస్తున్న కామెంట్స్ బాలయ్యకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లు టాక్. ‘కథానాయకుడు’ మూవీ అంతా ఎన్టీఆర్ సినిమా జీవితానికి సంబంధించి ఉంటే ‘మహానాయకుడు’ మూవీ ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించి ఉంటుంది అన్న లీకులు ఇచ్చారు. 

ఇలాంటి పరిస్థుతులలో ‘మహానాయకుడు’ ట్రైలర్ ఒక మంచి డైలాగ్ తో లేదంటే ఒక మంచి సీన్ తో ఎండ్ చేస్తారని బాలయ్య అభిమానులు భావించారు. అయితే దీనికి భిన్నంగా ఈమూవీకి సంబంధించి ఒక సీన్ తరువాత మరొక సీన్ ఎలా వస్తుందో అలా ప్రతి సీన్ ను ఒక సాంపిల్ గా వదిలినట్లు అనిపిస్తోంది కానీ ‘మహానాయకుడు’ ట్రైలర్ లో ఎటువంటి ఫోర్స్ లేదు అని ఏకంగా బాలయ్య అభిమానులే అభిప్రాయపడుతూ ఉండటంతో బాలకృష్ణ క్రిష్ పై తీవ్ర అసహనాన్ని వ్యక్త పరిచినట్లు ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 
NTR-Biopic-Mahanayakudu-
వాస్తవానికి ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు పార్ట్ లుగా కాకుండా ఒకే మూవీగా తీయాలని బాలకృష్ణ భావిస్తే క్రిష్ ఒత్తిడితో ఈమూవీ రెండు భాగాలుగా నిర్మాణం జరుపుకుంది అని చాలామంది అంటారు. దీనికితోడు ‘మహానాయకుడు’ మూవీకి సంబంధించిన స్టిల్స్ అన్నీ ‘కథానాయకుడు’ ప్రమోషన్ లోనే విడుదల చేయడంతో ఇక ‘మహానాయకుడు’ ప్రమోషన్ కు సంబంధించి క్రిష్ కొత్తగా చూపించే స్టిల్స్ ఏమీ లేకపోవడం ఈమూవీ పరిస్థిని మరింత అయోమయంలో పడేసింది అని అంటున్నారు. 

దీనికితోడు ఈమధ్య ‘మహానాయకుడు’ మూవీకి సంబంధించి క్రిష్ విడుదల చేస్తున్న స్టిల్స్ లో బాలకృష్ణవి కాకుండా ఎక్కువగా రానావి ఉండటంతో ‘మహానాయకుడు’ మూవీకి హీరో బాలకృష్ణ కాకుండా రానా అన్న ఫీలింగ్ వస్తుందని కనీసం ట్రైలర్ కట్ చేసే విషయంలో ప్రతిభ ఎందుకు కనపరచలేదు అంటూ బాలయ్య క్రిష్ కు గట్టి క్లాస్ పీకినట్లు టాక్. దీనితో ‘మహానాయకుడు’ కి కనీసం ఓపెనింగ్స్ అయినా వస్తాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: