ఈ మద్య మెగాబ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా వరుస వీడియోలతో నానా హంగామా చేస్తున్నారు.  మొన్నటి వరకు బాలయ్యను టార్గెట్ చేసుకుంటే..తర్వాత సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్ ని కూడా టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఆంధ్రప్రదేశ్ రాజకీయ అంశాలని టార్గెట్ చేస్తూ నాగబాబు చేస్తున్న వీడియోలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్, చిరంజీవిపై వచ్చే విమర్శలపై కూడా ఈ మెగా బ్రదర్ స్పందిస్తున్నారు.మెగాబ్రదర్ నాగబాబు మరోసారి ఉగ్రరూపం దాల్చారు.
Image result for pawan kalyan nagababu varun
తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన కామెంట్స్ చేశారు నాగబాబు. బాలక్రిష్ణపై తాను ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చింది.. పవన్ కళ్యాణ్ ప్యాకేజీలు.. మహిళల వస్త్రధారణ, ఇలా గతంలో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.   ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు, ఆయన తనయుడు వరుణ్ తేజ్ కలసి 1.25 కోట్లు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విరాళంపై కమెడియన్ పృథ్వి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చిన డబ్బుని తన కొడుకు ఖాతాలో వేసి దానిని జనసేన పార్టీకి ఇచ్చారని పృథ్వి వ్యాఖ్యానించాడు.   
Related image
ఇదే సందర్భంలో ప్రముఖ కమెడియన్, వైఎస్ఆర్సీపీ సెక్రటరీ పృథ్వీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జనసేన  అధినేత పవన్ కల్యాణ్ ప్యాకేజీలు తీసుకుంటున్నారంటూ వస్తున్న ఆరోపణలపై  నాగబాబు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ‘ఫండ్ గురించి పృథ్వీ కామెంట్ చేశాడా.. నిజంగా పృథ్వి అన్నాడా.. ఏయ్ పృథ్వీ రేపు ఫోన్ చేయరా.. ఈ ప్రశ్నకు నేను నీకే ఆన్సర్ ఇస్తాను.

పృథ్వీ నీకే చెబుతున్నా.. రేప్పొద్దున్న ఫోన్ చెయ్.. నా నెంబర్ నీ దగ్గర ఉంది’ అంటూ వెలెత్తి మరీ ఇంటర్వ్యూ నుండే పృథ్వీకి వార్నింగ్ ఇచ్చారు నాగబాబు.  కల్యాణ్ బాబు ప్యాకేజీలు తీసుకున్నారా? ఆయనకా అవసరం ఏంటి? వాళ్లు ఇచ్చేది ఎంత? పవన్ సినిమాలు చేస్తే ఏడాదికి రూ.150 కోట్లు సంపాదించే సత్తా పవన్‌కు ఉంది అని ఆగ్రహంతో ఊగిపోయారు.  పవన్‌పై ప్యాకేజీ కామెంట్ చేసే వారిని తాను బాస్టర్డ్స్ అంటానంటూ బూతులతో మొదలుపెట్టిన నాగబాబు అటువంటి ఆరోపణలు చేసే వారిని చెప్పుతో కొడతానని హెచ్చరించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: