తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చారు అక్కినేని నాగ చైతన్య, అఖిల్.  కింగ్ నాగార్జున నట వారసులుగా ఈ ఇద్దరు హీరోలు వెండి తెరపై ఎంట్రీ ఇచ్చినా సరైన హిట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.  అక్కినేని నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటింది.  కాకపోతే ఇండస్ట్రీలో చైతూకి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.  ఇక వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ ఆ చిత్రంతో పెద్దగా విజయాన్ని అందుకోలేక పోయాడు. 
Image result for bommarillu bhaskar
ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను లాంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయాడు.  ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు అఖిల్. తాజా సమాచారం ప్రకారం అక్కినేని అఖిల్ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక చిత్రాన్ని చేయనున్నాడని తెలుస్తోంది.  మొదటి చిత్రంతోనే నంది అవార్డు గెల్చుకున్న భాస్కర్ తర్వాత చిత్రాలతో పెద్దగా మెప్పించలేక పోయాడు. 

తెలుగులో చివరిగా 'ఒంగోలుగిత్త' చిత్రానికి దర్శకత్వం వహించిన బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పుడు అఖిల్ చిత్రం తీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని మెగా నిర్మాత అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. హీరోయిన్లు ఎవరు అన్న విషయం ఇంకా తెలియరాలేదు.  ఈ చిత్రం గురించి త్వరలో అధికార ప్రకటన రావొచ్చని భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: