బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ విషయంలో సౌత్ ఇండియాలో నెంబర్ వన్ గా కొనసాగుతున్న మహేష్ బాబు స్థానానికి ఎవరూ ఊహించని విధంగా జూనియర్ ఎన్టీఆర్ షాక్ ఇవ్వబోతు ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది కాలంగా బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ విషయంలో శ్రద్ధ పెడుతున్న జూనియర్ పార్లే ఆగ్రో సంస్థతో ఒక పెద్ద బిజినెస్ డీల్ సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 
చాలా ఇష్టం
ఈ సంస్థ ఉత్పత్తి చేసే యాప్పి ఫీజ్ శీతల పానీయం ప్రమోషన్ కోసం ఈ సంస్థ తయారు చేస్తున్న ఒక భారీ యాడ్ లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ యాడ్ దక్షిణ భారత దేశానికి సంబంధించిన అన్ని భాషలలోను తయారు అవుతున్న నేపధ్యంలో ఈ సమ్మర్ నుండి సౌత్ ఇండియాకు సంబంధించిన అన్ని భాషల టివి ప్రోగ్రామ్స్ లో జూనియర్ యాడ్ విపరీతంగా కనిపించబోతోంది. 
 ఆర్ఆర్ఆర్‌లో
ఈ యాడ్ కు సంబంధించి అత్యంత భారీ పారితోషికం జూనియర్ కు ఇచ్చినట్లు సమాచారం. ఉత్తర భారతదేశానికి సంబంధించి అన్ని రాష్ట్రాలలో ఈ యాడ్ లో బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తుంటే దక్షిణ భారత దేశానికి సంబంధించి జూనియర్ ను ఎంపిక చేయడం అతడి స్టామినాను సూచిస్తోంది. 
Jr NTR
వాస్తవానికి ఇలాంటి మల్టీ నేషనల్ కంపెనీల యాడ్స్ లో ఎక్కువగా మహేష్ అల్లు అర్జున్ లు కనిపిస్తూ ఉంటారు. అయితే పార్లే కంపెనీ సౌత్ ఇండియాలో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని తమ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా జూనియర్ ను ఎంపిక చేసినట్లు టాక్. ఇప్పట్లో జూనియర్ నటించే ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల కాని నేపధ్యంలో అతడి అభిమానులు ఇక కొంతా కాలం ఈ యాడ్ ద్వారా తమ హీరోను బుల్లితెర పై చూసుకుంటూ తృప్తి పడవలసి ఉంటుంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: