సినిమాలలో రాజకీయాల్లో వ్యాపారాలలో విజయం లేకపోతే ఎవరు ఎవరి గురించి పట్టించుకోరు. అయితే ఇలాంటి పరిస్థితి నాగార్జున కొడుకు అఖిల్ కు కూడా ఎదురు కావడం మీడియా వర్గాలకు షాక్ ఇచ్చినట్లు గా వార్తలు వస్తున్నాయి. అఖిల్ సినిమాలలోకి రాక ముందు క్రేజీ సెలిబ్రిటీగా కొనసాగుతూ వచ్చాడు. మంచి క్రికెటర్ గా అతడికి చాలా మంచి పేరు ఉంది. అయితే ఆ క్రేజ్ తన సినిమాలకు పనికి వస్తుందని భావించి అఖిల్ మూడు సినిమాలు చేసినా అతడి క్రేజ్ ఏసినిమాను రక్షించ లేకపోయింది. 
Akhil-Akkineni-Photos-From-Debut-Movie.jpg
ఇలాంటి  పరిస్థితులలో అతడి పాపులారిటీ రోజురోజుకు తగ్గిపోతోంది అని చెప్పే సంఘటన జరగడం చాలామందిని ఆశ్చచర్య పరుస్తోంది. ఇక వివరాలలోకి వెళ్ళితే అవసరాల శ్రీనివాస్ హీరోగా లేటెస్ట్ గా మొదలైన సినిమా లాంఛ్ ఫంక్షన్ కు క్లాప్ కొట్టడానికి అక్కినేని అమలను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. అయితే ఎవరు ఊహించని విధంగా అమలతో పాటు అఖిల్ కూడ ఈ ఫంక్షన్ కు వచ్చాడు.
Exclusive:Nithin introducing Akkineni Akhil as Hero
అయితే ఇంత వరకు బాగేనే ఉన్నా ఈ ఫిలిం ఫంక్షన్ హడావుడిలో అఖిల్ ను చాలమంది పట్టించుకోలేదు అని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా నాని ఈ ఫంక్షన్ కు వచ్చిన తర్వాత అందరి దృష్టి నాని వైపు వెళ్లి పోవడంతో  అఖిల్ పూర్తిగా సైడ్ ట్రాక్ అయిపోయాడు అని టాక్. దీనితో జరుగుతున్న పరిణామాలు గ్రహించిన  అఖిల్ కాస్త నవ్వు కుంటూనే వెనక్కి వెళ్లిపోయాడట. 
అఖిల్ Mr.మజ్ను ఆ మూవీకి రీమేకా ?
ఈ విషయాలను ఈఫంక్షన్ కు వచ్చిన వారు చాలామంది పట్టించుకోకపోయినా ఆ ఫంక్షన్ ను కవర్ చేయాడానికి వచ్చిన మీడియా వర్గాలు పసిగట్టినట్లు సమాచారం. దీనితో హిట్స్ లేక పోయేసరికి అఖిల్ ను కూడ పట్టించుకోవడం లేదా అంటూ ఆ కార్య క్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా వర్గాలు తమలో తాము గుసగుసలు ఆడుకున్నట్లు టాక్.  ఈ విషయం అఖిల్ లైట్ గా తీసుకున్నా అఖిల్ కు అవమానం జరిగింది అంటూ వార్తలు రావడం అక్కినేని కాంపౌండ్ కు షాక్ ఇచ్చినట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: