మెగాస్టార్ చిరంజీవి హీరోగా మంచి ఫామ్ లో ఉండగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.  పది సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న ఆయన కేంద్ర మంత్రిగా వ్యవహరించారు.  చాలా కాలం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్  150’చిత్రంతో రీ  ఎంట్రీ ఇచ్చారు.  ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.  ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’చిత్రంలో నటిస్తున్నారు.  ఈ చిత్రం షూటింగ్ మొదలై షరవేగంగా జరుపుకుంటుంది. ఆ మద్య ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. 
Image result for seiya narasimha reddy
ఇందులోని పాత్రలకు సంబంధించిన ఒక్కో పోస్టర్ కూడా రిలీజ్ చేస్తున్నారు.  సుమారు రూ.200 కోట్ల బడ్జెట్ తో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  తెలుగు వారి తేజం అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీష్ సైన్యంతో పోరాడిన మొదటి తెలుగు వీరుడు.  ఆయన జీవిత కథ ఆధారంగా సైరా నరసింహారెడ్డి చిత్రం తెరకెక్కిస్తున్నారు.
Image result for seiya narasimha reddy
ఉయ్యాలవాడ వర్ధంతిని పురస్కరించుకుని, ఆయన అసలు చిత్రాన్ని దర్శకుడు సురేంద్రరెడ్డి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు."మా హీరో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఇదే మా సెల్యూట్' అని నివాళులు అర్పిస్తూ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.  ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్, నయనతార,తమన్నా ,జగపతిబాబు,విజయ్ సేతుపతి, సుదీప్ వంటి భారీ తారాగణంతో రూపొందుతోన్న 'సైరా' సినిమాపై, భారీ అంచనాలు వున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: