పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ లు విడిపోయి ఎవరి జీవితాలలో వారు బిజీగా ఉన్నారు. గత సంవత్సరం రేణుదేశాయ్ అమెరికాకు చెందిన ఒక వ్యక్తిని పెళ్లాడబోతున్నట్లు ప్రకటిస్తే గత సంవత్సరం నుండి పవన్ సినిమాలను వదిలి ప్రజల బాట పట్టాడు. ప్రస్తుతం వీరిద్దరూ వేరువేరు మార్గాలలో పయనిస్తున్నా యాదృశ్చికంగా వీరిద్దరూ వేరువేరు కార్యక్రమాలతో కర్నూల్ జిల్లాలో ఒకేసారి ఎవరికివారు పర్యటనలు చేస్తూ ఉండటం పవన్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది.  
Renu Desai
రేణుదేశాయ్ సాక్షి ఛానల్ కోసం రైతుల సమస్యల పై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తూ ఏకంగా రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడటానికి కర్నూల్ జిల్లాలోని మంత్రాలయంలో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తూ రైతుల సమస్యల గురించి రైతుల ఆత్మహత్యల గురించి రైతుల అభిప్రాయాలను సేకరిస్తోంది. ప్రస్తుతం పవన్ కూడ ఇదే కర్నూల్ జిల్లాలో పర్యటిస్తూ జనం మధ్య మమేకం అవ్వుతూ ముఖ్యంగా యూత్ ఓటర్లను ఆకర్షించదానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. 
Renu Desai damage Pawan Kalyan image
రేణు సినిమాల గురించి దూరం అయ్యాక గతః సంవత్సరం ఒక ప్రముఖ ఛానల్ నిర్వహించిన డాన్స్ షోకు జడ్జిగా వచ్చిన విషయం తెలిసిందే. దీనికితోడు త్వరలో ప్రారంభం కాబోయే బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న 'టైగర్ నాగెశ్వరారావు బయోపిక్ లో రేణుదేశాయ్ ఓకే కీలక పాత్ర చేయబోతోంది. 
పవన్ కళ్యాణ్ నన్ను విడాకులు అడిగారు': రేణు దేశాయ్
రేణుదేశాయ్ నటిస్తోంది అంటేనే ఆశ్చర్యపోయిన పవన్ అభిమానులు ఇప్పుడు ఆమె యాంకర్ అవతారం ఎత్తడమే కాకుండా పవన్ తన మాటలతో విపరీతంగా దాడి చేస్తున్న వైఎస్అఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కు సంబంధించిన ఛానల్ లో ఈమె ప్రత్యేక క్రార్యక్రమాలు నిర్వహించడం పవన్ అభిమానులకు కూడ అంతపెట్టని విషయంగా మారింది. రాజకీయాలలో సినిమాలలో శాశ్విత శత్రువులు మిత్రులు ఉండరు కాబట్టి రాబోయే రోజులలో పవన్ జగన్ ల కలయికకు రేణుదేశాయ్ సాక్షి యాంకర్ గా మారడం ఒక సంకేతమా అంటూ పవన్ అభిమానులు కూడ సందేహాలు వ్యక్త పరుస్తున్నట్లు టాక్..   



మరింత సమాచారం తెలుసుకోండి: