తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు శివాజీరాజా.  విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించిన శివాజీరాజా ప్రస్తుతం మా అసోసియేషన్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.   'మా' అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు. 

ఈ సంద్భంగా కమెడియన్ వేణు మాధవ్ మాట్లాడుతూ..శివాజీరాజా అంతటి చెడ్డవాడు లేడు .. ఆయనంత దుర్మార్గుడు లేడు అంటూనే తనదైన శైలిలో శివాజీరాజా మంచితనాన్ని గురించి చెప్పుకొచ్చాడు. మొదట వేణు మాధవ్ అన్న మాటలకు అంతా షాక్ అయినా..తర్వాత మనోడు శివాజీరాజా ను తెగ పొడిగేస్తూ మాట్లాడిన మాటలకు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. 

శివాజీ అన్నా, చేపల పులుసు తిందువుగానీ రా'' అని నేను అంటే, "వద్దురా .. ఆ చేపల పులుసుకు ఎంత ఖర్చు అవుతుంది .. ఓ 500 అవుతుందా? అందులో ఒక 300 ఏ ఆర్టిస్టుకైనా ఇవ్వు .. వాళ్లకి ఒకపూట గడిచిపోతుంది" అనేవాడు అంటూ వేణుమాధవ్ చేపల పులుసు సంగతి చెప్పుకొచ్చాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: