నిన్నరాత్రి జరిగిన ‘118’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చాలా సేపు మౌనంగా ఉన్న కళ్యాణ్ రామ్ బాలకృష్ణ అభిమానుల పై ఒకేసారి అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేయడంతో ఈ ఫంక్షన్ కు వచ్చిన బాలయ్య అభిమానులు షాక్ అయినట్లు సమాచారం. కళ్యాణ్ రామ్ ప్రసంగిస్తున్న సమయంలో కొందరు బాలయ్య అభిమానులు చేసిన అల్లరితో అసహానానికి లోనైన కళ్యాణ్ రామ్ బాలయ్య సమక్షంలోనే బాలయ్య అభిమానులకు క్లాసు తీసుకున్నాడు. 
జై బాలయ్య జైజై బాలయ్య అంటూ మళ్లీ
ఇక వివరాలలోకి వెళ్ళితే కళ్యాణ్ రామ్ స్పీచ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్న సమయంలో కొందరు అదేపనిగా ‘జై బాలయ్య జైజై బాలయ్య’ అంటూ నినాదాలతో కాసేపు కార్యక్రమాన్ని హోరెత్తించారు. దీనితో  తాను ఏం మాట్లాడాలో కూడా అర్థంకానక అయోమయంలోకి  కళ్యాణ్ రామ్వెళ్ళిపోయాడు.
నా మైండ్ బ్లాక్ అయింది
అంతేకాదు సైలెంట్ గా ఉండమని రిక్వెస్ట్ చేస్తూ మనమంతా పెద్దాయన నందమూరి తారకరామరావు వారి అడుగుజాడల్లో నడవాలని ఆయన నేర్పిన క్రమశిక్షణ మర్చిపోకూడదని పదేపదే విజ్ఞప్తి చేసాడు. అయినా అల్లరి చల్లారలేదు దీనితో మరో రెండుమూడు సార్లు ప్రయత్నించినా హడావిడి తగ్గక పోవడంతో కళ్యాణ్ రామ్ తనలోని అసహనాన్ని బయట పెట్టాడు. 
నివేదా థామస్ నటన కళ్లనీళ్లు పెట్టించింది
ఈ విషయాలు అన్నీ పక్కనే ఉన్న బాలయ్య చూస్తున్నా ఆ విషయాలు పట్టించుకోకుండా బాలకృష్ణ ఏటో ఆలోచిస్తూ నిలబడ్డాడు. ఆతరువాత కొంత హడావిడి తగ్గిన తరువాత కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ గతంలో తను నటించిన చాల సినిమాలు ఫెయిల్ అయిన విషయాన్ని ఓపెన్ గా అంగీకరించి అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ‘118’ సక్సస్ అయిన తరువాత ఈమూవీ గురించి తాను మాట్లాడుతాను అంటూ ఈమూవీ పై తనకున్న నమ్మకాన్ని వివరించాడు. మరి కళ్యాణ్ రామ్ నమ్మకం ఎంత వరకు సక్సస్ అవుతుందో చూడాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: