తెలుగు బుల్లితెరపై వచ్చిన బిగ్ బాస్ సీజన్ 1 మంచి హిట్ టాక్ వచ్చింది.   ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించడారు.  శని, ఆదివారల్లో ఎన్టీఆర్ చేసే సందడికి బుల్లితెర అభిమానులు ఫిదా అయ్యారు.  ఇక బిగ్ బాస్ సెకండ్ సీజన్ కి నేచురల్ స్టార్ నాని ఎంట్రీ ఇచ్చాడు.  ఈ సీజన్ 100 రోజులు నడిచింది.  తెలుగు బిగ్ బాస్ 2 మొదటి నుంచి చివరి వరకు ఏదో ఒక కాంట్రవర్సీతో ప్రతిరోజూ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వచ్చింది. 

మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 2 కౌశల్ విన్నర్ అయ్యారు.  అయితే బిగ్ బాస్ లో హౌజ్ లో ఉండగానే కౌశల్ కి బయట కౌశల్ ఆర్మీ ఏర్పటం..ఆయన గెలుపు కోసం ప్రయత్నాలు చేయడం వంటివి చేశారు.  దీనిపై పలు విమర్శలు కూడా వచ్చాయి.  బిగ్ బాస్ విన్నర్ గా బయటకు వచ్చిన కౌశల్ పై పలువురు విమర్శలకు దిగారు. 

తాజాగా ఈ విషయాలపై స్పందించిన కౌశల్ కౌశల్ ఆర్మీపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని.. ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని  పేర్కొన్నారు.  కొందరు తనను వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారని విమర్శించాడు. బాబు గోగినేని తనను ఏమీ చేయలేరని, బిగ్‌బాస్-2లోని కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కౌశల్ విమర్శించాడు.   కొందరు తనతో సినిమా తీస్తామని చెప్పి మోసం చేశారని కౌశల్‌ వాపోయాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: