కొన్ని రోజుల క్రితం రేణు దేశాయ్ ఒక ప్రముఖ ఛానల్ కోసం యాంకర్ అవతారం ఎత్తి రైతుల సమస్యల పై ఒకప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. కర్నూల్ జిల్లా రైతులతో ఈ కార్యక్రమం జరిగింది. మంచి అనుభం ఉన్న న్యూస్ ప్రజెంటర్ లా రేణు దేశాయ్ అక్కడి రైతుల సమస్యలు తెలుసుకుంటూ వారితో మమైకం అయిపోతు వ్యవహరించిన ఆమె తీరు అక్కడి రైతులను బాగా ఆకర్షించింది. 
అకీరాకు మెసేజ్ పెట్టా
అయితే అక్కడి చాలామంది రైతులు ఆమెను ఒక న్యూస్ ప్రజెంటర్ లా కాకుండా చాలామంది పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే గుర్తించడం ఇక్కడి ట్విస్ట్. ఇదే సందర్భంలో అదే సమయానికి పవన్ కళ్యాణ్ కూడ కర్నూల్ జిల్లా పర్యటన చేస్తున్న నేపధ్యంలో చాలామంది రేణు పవన్ కు కౌంటర్ ఇవ్వడానికి ఆమె ఇలాంటి కార్యక్రమం నిర్వహించిందా లేదంటే రేణు దేశాయ్ కూడ రాజకీయాలలోకి రాబోతోందా అంటూ కొన్ని మీడియా సంస్థలు ఆసక్తికర ఊహాగానాలు చేసాయి. 
I Used To Call Him Every Night: Renu Desai
దీనితో షాక్ అయిన రేణు ఈ విషయాల పై స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ వారసులు తన వద్ద పెరుగుతూ ఉన్న నేపధ్యంలో పవన్ కు వ్యతిరేకంగా తాను ఎందుకు రాజకీయ పార్టీలో చేరతాను అంటూ వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు ఇది అంతా మీడియా తమ రేటింగ్స్ పెంచుకోవడానికి చేస్తున్న ప్రక్రియ అంటూ ఇలాంటి విషయాల పై ఎటువంటి పనీ లేనివారు మాత్రమే ఊహాగానాలు చేస్తారు అంటూ సెటైర్లు వేసింది.

తాను పవన్ కళ్యాణ్ ఒకేసారి కర్నూల్ జిల్లాలో పర్యటించడం అనుకోకుండ జరిగిన విషయం అని చెపుతూ ఈ విషయం గురించి ప్రస్తుతం పూణేలో ఉన్న అకిరా నందన్ కు మెసేజ్ పెట్టి తాను పవన్ ఒకే జిల్లాలో ఉన్నాము అని చెప్పినప్పుడు అకిరా ఇచ్చిన స్పందనను ఆమె వివరించింది. ఈ విషయాలను తెలుసుకున్న అకిరా ‘మీ రిద్దరూ బాగుండాలి’ అంటూ తనకు మెసేజ్ పెట్టిన విషయాన్ని వివరిస్తూ తమ కుటుంబ సభ్యులలో ఎవరికీ లేని అనుమానాలు మీడియాకు ఎందుకు వస్తున్నాయి అంటూ మీడియా పై ఎదురు దాడి చేసింది రేణు  దేశాయ్..


మరింత సమాచారం తెలుసుకోండి: