ఇండస్ట్రీ వర్గాలలోనే కాకుండా సాధారణ ప్రేక్షకులలో కూడ విపరీతమైన హైక్ తెచ్చుకున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల విషయంలో రామ్ గోపాల్ వర్మ అనుసరిస్తున్న కన్ఫ్యూజన్ అనేక అనుమానాలకు తావు ఇస్తోంది. ‘మహానాయకుడు’ ఫ్లాప్ తరువాత ఏర్పడ్డ గ్యాప్ ను వర్మ ఎందుకు వృధా చేసుకుంటున్నాడు అంటూ మరికొందరు ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఈమూవీకి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు తప్పించి అన్ని పనులు పూర్తి కావడంతో కొందరు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను వర్మ ఆఫీసులో చూసినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీని చూసిన కొందరు ప్రముఖులు చెప్పినట్లుగా ప్రచారంలో ఉన్న వార్తలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.
హడావిడి చేస్తున్న ఈవార్తల ప్రకారం ఈసినిమాలో ట్రెయిలర్ ను చూసి ఏదో వుంటుందని భ్రమ పడతారని కానీ ఆ సినిమాలో అంత సంచలనం ఏమీ లేదని చాలా నిదానంగా సాగుతూ ఎక్కువగా డ్రామా లేకుండా చప్పగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వర్మ అందరికీ తెలిసిన విషయాలే మళ్ళీ ఈసినిమాలో చూపెట్టిన నేపధ్యంలో ఈసినిమాను చూసే సగటు ప్రేక్షకుడుకి పాత న్యూస్ పేపర్ చదువుతున్న ఫీలింగ్ కలుగుతుందనీ టాక్.
దీనితో సుమారు 10 కోట్ల వరకు ఈమూవీ పై పెట్టుబడి పెట్టిన బయ్యర్ల పరిస్థితి ఏమిటి అన్న కోణంలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా వర్మ తీస్తున్న సినిమాలు కేవలం ట్రైలర్స్ వరకు హడావిడి చేసి తరువాత పేలిపోతున్న నేపధ్యంలో ఇప్పుడు అదే లిస్టులో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చేరుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇది అంతా వర్మ వ్యతిరేకులు చేస్తున్న ప్రచారం అనీ ఈమూవీలో అద్భుతమైన సంచలనాలు ఉన్నాయి అంటూ ఈమూవీ బయ్యర్లకు ఈమూవీ నిర్మాతలు బరోసా ఇస్తున్నట్లు సమాచారం..