తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఎంతో క్రేజ్.  ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు అరడజను మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు..ఇస్తూనే ఉన్నారు.  మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ స్థాయిలో మాస్ ఇమేజ్ సంపాదించిన హీరో పవన్ కళ్యాన్.  నటుడిగానే కాకుండా ప్రస్తుతం ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.  జనసేన పార్టీ తరుపు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సిద్దంగా ఉన్నారు. 
Related image
పవన్ తర్వాత మాస్ ఇమేజ్ సంపాదించిన హీరోలు అల్లు అర్జున్, రాంచరణ్.  వీరి తర్వాత ఈ మద్య వచ్చిన సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్.  రాంచరణ్ రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో తన చిన్ననాటి స్నేహితురాలైన ఉపాసను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  ఉపాసన ఫ్యామిలీ పూర్వికులది దోమకొండ.  కామారెడ్డి జిల్లాలో ఉన్న దోమకొండ శివాలయానికి చారిత్రక ప్రాశస్త్యం ఉంది. కాకతీయుల కాలంలో అంటే.. సుమారు 800 ఏళ్ల క్రితం దీనిని నిర్మించారు. 
Related image
దోమకొండ కోటను మాత్రం 400 ఏళ్ల క్రితం తమ పూర్వీకులే కట్టించారని పేర్కొంది.   అక్కడ ఎంతో ప్రసిద్ది గాంచిన శివాలయాన్ని ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు తప్పకుండా దర్శించుకుంటారు.  సంప్రదాయ వస్త్రాలు ధరించిన చరణ్ శివలింగాన్ని నీటితో శుభ్రం చేసి పూజలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉపాసన ట్వీట్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: