తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి, బాహుబలి 2 లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలు తెరకెక్కించిన రాజమౌళి మరో అద్భుతాన్ని సృష్టించడానికి సమాయత్తమవుతు న్నాడు. బాహుబలి 2 తర్వాత దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకున్న రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రాంచరణ్ లతో మల్టీస్టారర్ చిత్రాన్ని తీస్తున్నారు. ఈ చిత్రం బడ్జెట్ కూడా భారీగానే ఉండబోతుందట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.
ఇప్పటికే ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను .. చరణ్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఇక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత తదుపరి షెడ్యూలో కోల్ కొతాలో ప్లాన్ చేస్తున్నారట. 40 రోజుల పాటు అక్కడ జరిగే ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, రాంచరణ్ లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారట.
ఈ సీన్స్ ఈ చిత్రానికి హైలైట్స్ లో ఒకటిగా నిలవడం ఖాయమని అంటున్నారు. అయితే ఈ షూటింగ్ అవుట్ డోర్లో తీస్తారా? లేకపోతే ఎక్కడైనా భారీ సెట్స్ వేశారా? అనేది తెలియాల్సి వుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు అలియాభట్, పరిణితి చోప్రాలను తీసుకునే ప్రయత్నంలో ఉన్నారట.